ETV Bharat / business

కుదిపేసిన కరోనా భయాలు- సెన్సెక్స్ 1,708 డౌన్​

author img

By

Published : Apr 12, 2021, 3:43 PM IST

Updated : Apr 12, 2021, 3:52 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ ఏకంగా 1,708 పాయింట్లు తగ్గి.. 47,883 వద్దకు చేరింది. నిఫ్టీ 524 పాయింట్ల నష్టంతో 14,350 మార్క్​ను కోల్పోయింది. ఇండస్​ఇండ్ బ్యాంక్​ షేర్లు భారీగా పతనమయ్యాయి. డాక్టర్​ రెడ్డీస్​ మాత్రం దాదాపు 5 శాతానికిపైగా పుంజుకుంది.

Covid Impact on Stock markets
మార్కెట్లను కుదిపేసిన కరోనా భయాలు

స్టాక్ మార్కెట్లను కరోనా సెకండ్​ వేవ్​ భయాలు కుదిపేశాయి. బేర్​ దెబ్బకు సోమవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ ఏకంగా 1,708 పాయింట్లు తగ్గి 47,883 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 524 పాయింట్ల నష్టంతో 14,310 వద్దకు చేరింది.

దేశంలో ఒకే రోజు దాదాపు 1.7 లక్షల కరోనా కేసులు నమోదవడం.. మరోసారి కొవిడ్ ఆంక్షలు కఠినతరం చేయొచ్చన్న అంచనాలను బలపరిచింది. దీనితో మదుపరులు అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయంగానూ సానుకూల పవనాలు లేకపోవడం వల్ల మార్కెట్లు ఈ స్థాయిలో పతనమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక, లోహ షేర్లు నష్టాలకు ప్రధానంగా కారణమయ్యాయి.

సోమవారం సెషన్ ప్రారంభమైన గంటలోపే బీఎస్​ఈ మదుపరుల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 48,956 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,693 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,652 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,248 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

డాక్టర్​ రెడ్డీస్​ (దాదాపు 5 శాతం) మినహా.. 30 షేర్ల ఇండెక్స్​లోని కంపెనీలన్నీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ, ఓఎన్​జీసీ, ఎం&ఎం, టైటాన్​ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. సియోల్​ సూచీ మాత్రం లాభాలను గడించింది.

ఇదీ చదవండి:పసిడిపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమా?

స్టాక్ మార్కెట్లను కరోనా సెకండ్​ వేవ్​ భయాలు కుదిపేశాయి. బేర్​ దెబ్బకు సోమవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ ఏకంగా 1,708 పాయింట్లు తగ్గి 47,883 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 524 పాయింట్ల నష్టంతో 14,310 వద్దకు చేరింది.

దేశంలో ఒకే రోజు దాదాపు 1.7 లక్షల కరోనా కేసులు నమోదవడం.. మరోసారి కొవిడ్ ఆంక్షలు కఠినతరం చేయొచ్చన్న అంచనాలను బలపరిచింది. దీనితో మదుపరులు అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయంగానూ సానుకూల పవనాలు లేకపోవడం వల్ల మార్కెట్లు ఈ స్థాయిలో పతనమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక, లోహ షేర్లు నష్టాలకు ప్రధానంగా కారణమయ్యాయి.

సోమవారం సెషన్ ప్రారంభమైన గంటలోపే బీఎస్​ఈ మదుపరుల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 48,956 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,693 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,652 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,248 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

డాక్టర్​ రెడ్డీస్​ (దాదాపు 5 శాతం) మినహా.. 30 షేర్ల ఇండెక్స్​లోని కంపెనీలన్నీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ, ఓఎన్​జీసీ, ఎం&ఎం, టైటాన్​ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. సియోల్​ సూచీ మాత్రం లాభాలను గడించింది.

ఇదీ చదవండి:పసిడిపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమా?

Last Updated : Apr 12, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.