కరోనా వైరస్ అన్ని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మహమ్మారి ధాటికి విమానయాన రంగం కుదేలవుతోంది. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఏప్రిల్ 30 వరకు తన అంతర్జాతీయ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
"కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటే సర్వీసులను తిరిగి ప్రారంభిస్తాం."
-ఓ స్పైస్జెట్ అధికార ప్రతినిధి
కోల్కతా-ఢాకా విమాన సర్వీస్ కొనసాగుతుందని సంస్థ తెలిపింది. చెన్నై- కొలంబో సర్వీసులు మార్చి 25 నుంచి, దిల్లీ- దుబాయ్, ముంబయి- దుబాయ్ సర్వీసులను ఏప్రిల్ 16 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇదీ చూడండి:రేపే నిర్భయ దోషులకు ఉరి.. స్టే పిటిషన్ కొట్టివేత