ETV Bharat / briefs

పాలమూరు ఉల్లి రైతులకు కాస్త ఉపశమనం

ఇన్నాళ్లు మహబూబ్​నగర్ జిల్లా ఉల్లి రైతులు కనీస మద్దతు ధర లభించక తీవ్ర నష్టాన్ని చవిచూశారు. బుధవారం దేవరకద్ర మార్కెట్​లో ఉల్లికి ఆశాజనకంగా ధర రావటం వల్ల రైతులకు కాస్త ఊరట లభించింది.

author img

By

Published : Mar 27, 2019, 1:07 PM IST

Updated : Mar 27, 2019, 1:42 PM IST

ఆశాజనకంగా ఉల్లి ధర
ఆశాజనకంగా ఉల్లి ధర
మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్​లో ఉల్లి రైతులకు కొద్దిగా ఊరట లభించింది. ఇన్నాళ్లు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిన అన్నదాతలకు కనీస మద్దతు ధరతో కాస్త ఉపశమనం దొరికింది. ఈరోజు మార్కెట్​ ఉల్లి విక్రయాలను బహిరంగ వేలం ద్వారా నిర్వహించారు. పంట నాణ్యతను బట్టి క్వింటాకు 400 నుంచి 900 రూపాయల వరకు కొనసాగినట్లు మార్కెట్​ వర్గాలు తెలిపాయి.

పోయిన వారం వరకు క్వింటా ఉల్లి 300 నుంచి 670 రూపాయలు మాత్రమే ధర పలకడం వల్ల గిట్టుబాటు ధర లభించక చాలా మంది రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. కొంతమంది రైతులు తక్కువకు అమ్ముకోలేక పొలాల దగ్గర నిల్వ ఉంచారు. ఫిబ్రవరిలో చలిగాలులకు మొలకెత్తిన ఉల్లితో, మార్చి నెల ప్రారంభంలో ఎండలు పెరిగి ఆరబెట్టిన గడ్డ సన్నబడటం వల్ల రెండు విధాలుగా నష్టాలపాలయ్యారు. ఈనెల చివరి వారంలో ఉల్లిగడ్డకు డిమాండ్ పెరగడం వల్ల ఆశించిన ధరలు ఉల్లి రైతులు పొందగలుగుతున్నారు.

ఇవీ చూడండి:'విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది'

ఆశాజనకంగా ఉల్లి ధర
మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్​లో ఉల్లి రైతులకు కొద్దిగా ఊరట లభించింది. ఇన్నాళ్లు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిన అన్నదాతలకు కనీస మద్దతు ధరతో కాస్త ఉపశమనం దొరికింది. ఈరోజు మార్కెట్​ ఉల్లి విక్రయాలను బహిరంగ వేలం ద్వారా నిర్వహించారు. పంట నాణ్యతను బట్టి క్వింటాకు 400 నుంచి 900 రూపాయల వరకు కొనసాగినట్లు మార్కెట్​ వర్గాలు తెలిపాయి.

పోయిన వారం వరకు క్వింటా ఉల్లి 300 నుంచి 670 రూపాయలు మాత్రమే ధర పలకడం వల్ల గిట్టుబాటు ధర లభించక చాలా మంది రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. కొంతమంది రైతులు తక్కువకు అమ్ముకోలేక పొలాల దగ్గర నిల్వ ఉంచారు. ఫిబ్రవరిలో చలిగాలులకు మొలకెత్తిన ఉల్లితో, మార్చి నెల ప్రారంభంలో ఎండలు పెరిగి ఆరబెట్టిన గడ్డ సన్నబడటం వల్ల రెండు విధాలుగా నష్టాలపాలయ్యారు. ఈనెల చివరి వారంలో ఉల్లిగడ్డకు డిమాండ్ పెరగడం వల్ల ఆశించిన ధరలు ఉల్లి రైతులు పొందగలుగుతున్నారు.

ఇవీ చూడండి:'విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది'

Intro:Tg_Mbnr_01_27_Uilli_Dharalu_At_Devarakdra_Av_G3 దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి ధరలకు కాస్త ఊరట లభించింది ఇన్నాళ్లు గిట్టుబాటు ధర లేక విలవిలలాడిన ఉల్లి రైతులకు కాస్త ఊరట లభించింది కింటా ఉల్లి నాలుగు వందల నుంచి 900 వరకు కొనసాగింది


Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ లో బుధవారం ఉల్లి క్రయ విక్రయాలను బహిరంగ వేలం ద్వా
రా నిర్వహించారు . మార్కెట్లో లో ఉల్లి నాణ్యతను బట్టి నాలుగు వందల నుంచి 900 వరకు కొనసాగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి గత వారం వరకు quinta ఉల్లి మూడు వందల నుంచి 670 వరకు కొనసాగడంతో గిట్టుబాటు ధర లభించ క చాలా మంది రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు కొంతమంది రైతులు తక్కువ ధర దగ్గర అమ్ముకోలేక పొలాల దగ్గర ఆరబెట్టు కుంటే ఫిబ్రవరిలో లో ఉన్న చోటనే చలిగాలులకు మొలకెత్తిన ఉల్లితో, మార్చి నెల ప్రారంభంలో ఎండలు పెరిగి ఆరబెట్టిన గడ్డ సన్నబడటం తో మరో రకంగా నష్టాన్ని భరించారు . మార్చి చివరి వారంలో ఉల్లిగడ్డ నిల్వ ఉంటుందనే నమ్మకంతో, వినియోగదారుల డిమాండ్ పెరగడంతో ఉల్లి ధరల కు కాస్త ఊరట లభించింది.


Conclusion:దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ లో క్వింటా ఉల్లి నాలుగు వందల నుంచి తొమ్మిది వందల వరకు కాస్త పెరిగి రైతులకు ఊరటనిచ్చింది
Last Updated : Mar 27, 2019, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.