ETV Bharat / briefs

'కశ్మీర్​లో అశాంతికి పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం'

author img

By

Published : Mar 5, 2020, 11:11 AM IST

ఐరాస మానవహక్కుల కమిషన్​లో పాక్​ వ్యాఖ్యలపై భారత్​ ఘాటుగా సమాధానమిచ్చింది. జెనీవాలో జరిగిన యూఎన్​హెచ్​ఆర్​సీ 43వ సమావేశంలో కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తిన పాక్​పై విరుచుకుపడింది భారత్​. జమ్ముకశ్మీర్​లో అశాంతికి పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమని స్పష్టం చేసింది.

India hits out at Pakistan for false, fabricated concerns for human rights
'కశ్మీర్​లో అశాంతికి పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం'

జెనీవా వేదికగా జరిగిన ఐరాస మానవ హక్కుల కమిషన్​ 43వ సమావేశంలో పాకిస్థాన్​కు దీటుగా సమాధానం చెప్పింది భారత్​. మానవ హక్కల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న సమావేశాన్ని పాక్​ రాజకీయం చేస్తోందని ఆరోపించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్​ను దోషిగా చూపిస్తూ ఉద్దేశపూర్వకంగా ఆందోళనలు చేస్తోందని యూఎన్​హెచ్​ఆర్​సీలో భారత విదేశాంగ తొలి కార్యదర్శి విమర్శ్ ఆర్యన్​ విమర్శించారు.

"జమ్ముకశ్మీర్​లోని సైనికులు, ప్రజలకు హక్కులకు ఉగ్రవాదులతోనే ముప్పు ఉంది. పాక్​ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదమే ఇందుకు కారణం. భారత్​లో కశ్మీర్​ ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటుంది. దీనిపై పాక్ ఆశలు వదిలేసుకుంటే మంచిది."

- విమర్శ్​ ఆర్యన్​, యూఎన్​హెచ్​ఆర్​సీలో భారత తొలి కార్యదర్శి

జెనీవా వేదికగా జరిగిన ఐరాస మానవ హక్కుల కమిషన్​ 43వ సమావేశంలో పాకిస్థాన్​కు దీటుగా సమాధానం చెప్పింది భారత్​. మానవ హక్కల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న సమావేశాన్ని పాక్​ రాజకీయం చేస్తోందని ఆరోపించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్​ను దోషిగా చూపిస్తూ ఉద్దేశపూర్వకంగా ఆందోళనలు చేస్తోందని యూఎన్​హెచ్​ఆర్​సీలో భారత విదేశాంగ తొలి కార్యదర్శి విమర్శ్ ఆర్యన్​ విమర్శించారు.

"జమ్ముకశ్మీర్​లోని సైనికులు, ప్రజలకు హక్కులకు ఉగ్రవాదులతోనే ముప్పు ఉంది. పాక్​ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదమే ఇందుకు కారణం. భారత్​లో కశ్మీర్​ ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటుంది. దీనిపై పాక్ ఆశలు వదిలేసుకుంటే మంచిది."

- విమర్శ్​ ఆర్యన్​, యూఎన్​హెచ్​ఆర్​సీలో భారత తొలి కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.