ETV Bharat / briefs

'కేసీఆర్​ అంబేడ్కర్​ను అవమానిస్తున్నారు'

అంబేడ్కర్​ జయంతి రోజున  సీఎం కేసీఆర్​ పాల్గొనకుండా రాజ్యాంగ నిర్మాతను అవమానించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సీఎం తీరును నిరసిస్తూ ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేడ్కర్​ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

author img

By

Published : Apr 16, 2019, 4:55 PM IST

mandakrishna

ఎస్సీల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పంజాగుట్టలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అనుమతి లేకున్నా ఉంచారని, అంబేడ్కర్ విగ్రహానికి అనుమతి లేదని ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసన...

ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఈనెల 22 వరకు చేపడతామన్నారు. 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతామని స్పష్టం చేశారు.

'కేసీఆర్​ అంబేడ్కర్​ను అవమానిస్తున్నారు'

ఎస్సీల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పంజాగుట్టలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అనుమతి లేకున్నా ఉంచారని, అంబేడ్కర్ విగ్రహానికి అనుమతి లేదని ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసన...

ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఈనెల 22 వరకు చేపడతామన్నారు. 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతామని స్పష్టం చేశారు.

'కేసీఆర్​ అంబేడ్కర్​ను అవమానిస్తున్నారు'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.