తెలంగాణ అసెంబ్లీ నూతన భవన నిర్మాణం కోసం హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఉన్న రోడ్లు, భవనాల శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం అధికారుల బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు సమాచారం. కొత్త శాసనసభ భవన సముదాయం కోసం ఎర్రమంజిల్లోని స్థలంపై ప్రభుత్వం దృష్టి సారించింది. స్థలాలు ఖరారు అయ్యాక శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 27 వరకు మంచి ముహూర్తాలు ఉండటం వల్ల ఈ అంశంపై ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుని ప్రకటించాల్సి ఉంది.
ఇవీ చూడండి: 'డీజిల్ కోసం క్యాన్లు, బకెట్లతో ఎగబడ్డారు'