మండల, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అధ్యక్ష పదవులు రిజర్వ్ అయిన కేటగిరీల్లో ఒక్కరే సభ్యులు ఎన్నికైతే వారికే పదవి దక్కేలా నిబంధనలు సవరించారు. ఈ మేరకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
అధ్యక్ష పదవి రిజర్వ్ అయిన కేటగిరీ సభ్యులు ఒక్కరే ఉంటే ప్రతిపాదకులు, బలపరిచేవారు లేకుండానే నామినేషన్ దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది. ఆ తరహా నామినేషన్లు పరిగణలోకి తీసుకొని పాలకమండలి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక చేపట్టాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సందర్భాల్లో కోరం లేకపోయినపోయినప్పటికీ ఎన్నిక నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇదీ చూడండి: "పార్టీ కోసం కాదు... ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం"