కరోనా వైరస్ గాలి శుద్ధి పరికరాన్ని… మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల రసాయనశాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్ తయారు చేశారు. రూ. 6500తో తయారు చేసిన ఈ యంత్రంలో… నాలుగు ఛాంబర్లు ఏర్పాటు చేశారు. మొదటగా యూవీ లైట్, రెండో దశ సోడియం హైపోక్లోరైడ్తో ఫిల్టర్ అవుతుంది. ఈ రెండు దశల్లోనే కరోనా నిర్మూలించడం జరుగుందన్నారు.
మూడో దశ బేరియం హైడ్రాక్సైడ్, నాలుగో దశలో అలమ్(పటిక) ఫిల్టర్ అవుతుందని తెలిపారు. గాలిలో ఉన్న దుమ్ము, ధూళీ కణాలను శుద్ది చేస్తుందని వివరించారు. కరోన సోకినవారి వద్ద ఇది ఏర్పాటు చేస్తే ఇతరులకు సోకకుండా ఉంటుందని చెప్పారు. చిన్న గది అయితే పది నిమిషాల్లో శుద్ధి చేస్తుందని పేర్కొన్నారు. దీనిని రిమోటు సాయంతో ఉపయోగించొచ్చన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగ అధిపతి డాక్టర్ రాధిక… యంత్రం తీరును పరిశీలించి అభినందించారు. మరిన్ని యంత్ర పరికరాలు తయారు చేయడానికి ప్రణళికలు చేస్తున్నట్లు అధ్యాపకుడు శ్రీనివాస్ తెలిపారు.