Youtube channels blocked in India: నిఘా విభాగం అందించిన సమాచారంతో పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతోన్న యుట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను బ్లాక్ చేసినట్లు తెలిపింది సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ. జనవరి 20న ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు ఐబీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ విక్రమ్ సహాయ్.
" నిఘా విభాగం సమాచారంతో 35 యూట్యూబ్ ఛానళ్లు, 2 ట్విట్టర్, 2 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 2 వెబ్సైట్లు, ఓ ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేయాలని ఆదేశించాం. ఆయా ఖాతాలను పరిశీలిస్తే అవన్నీ పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నాయని తెలిసింది. భారత్కు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేయటం వంటివి చేస్తున్నారు. "
- విక్రమ్ సహాయ్, ఐబీ జాయింట్ సెక్రెటరీ.
ఆ యూట్యూబ్ ఛానళ్లకు 1.20 సబ్స్క్రైబర్లు, 130 కోట్ల వ్యూవ్స్ ఉన్నట్లు చెప్పారు ఐబీ మంత్రిత్వ శాఖ సెక్రెటరీ అపుర్వ చంద్ర. అలాంటి ఛానళ్లపై చర్యలు చేపట్టామని, ముందు ముందు మరిన్ని ఛానళ్లను బ్లాక్ చేస్తామన్నారు. ఆ దిశగా నిఘా విభాగం పని చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ప్రజల మద్దతు కూడా అవసరమన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: మోదీకి 71% ప్రజామోదం.. ప్రపంచంలోనే 'నంబర్ 1' దేశాధినేత