ETV Bharat / bharat

'కూచ్​బిహార్ నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం'

author img

By

Published : Apr 14, 2021, 1:19 PM IST

బంగాల్ కూచ్​బిహార్ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ​కూచ్​బిహార్​ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిశారు దీదీ.

mamata
బంగాల్​ సీఎం మమతా బెనర్జీ

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కూచ్​బిహార్​ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

mamata at cooch behar
బాధిత కుటుంబసభ్యులకు దీదీ పరామర్శ

"కూచ్​బిహార్​ ఘటనకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం. కాల్పుల తర్వాత 72 గంటల పాటు ఈ ప్రాంతంలో పర్యటించటం నిషేధం కాబట్టి బాధిత కుటుంబాలను కలవలేకపోయాను."

-- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

ఏప్రిల్​ 10న పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన తొలి ఓటర్​ 18 ఏళ్ల ఆనంద్ బర్మాన్​ కుటుంబానికి సైతం న్యాయం చేస్తామని దీదీ తెలిపారు.

బంగాల్ నాలుగో విడత పోలింగ్​ సందర్భంగా కూచ్​బిహార్​ జిల్లాలోని సీతల్​కుచి ప్రాంతంలో ఘర్షణ తలెత్తింది. బలగాల కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించకుండా నిషేధం విధించింది ఈసీ.

ఇదీ చదవండి : బంగాల్​ దంగల్​: దళితుల అండ దక్కేదెవరికో!

సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​​కు కరోనా

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కూచ్​బిహార్​ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

mamata at cooch behar
బాధిత కుటుంబసభ్యులకు దీదీ పరామర్శ

"కూచ్​బిహార్​ ఘటనకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం. కాల్పుల తర్వాత 72 గంటల పాటు ఈ ప్రాంతంలో పర్యటించటం నిషేధం కాబట్టి బాధిత కుటుంబాలను కలవలేకపోయాను."

-- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

ఏప్రిల్​ 10న పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన తొలి ఓటర్​ 18 ఏళ్ల ఆనంద్ బర్మాన్​ కుటుంబానికి సైతం న్యాయం చేస్తామని దీదీ తెలిపారు.

బంగాల్ నాలుగో విడత పోలింగ్​ సందర్భంగా కూచ్​బిహార్​ జిల్లాలోని సీతల్​కుచి ప్రాంతంలో ఘర్షణ తలెత్తింది. బలగాల కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించకుండా నిషేధం విధించింది ఈసీ.

ఇదీ చదవండి : బంగాల్​ దంగల్​: దళితుల అండ దక్కేదెవరికో!

సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.