ETV Bharat / bharat

ఇద్దరు హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాదులు అరెస్ట్​

author img

By

Published : Apr 26, 2021, 11:39 PM IST

కశ్మీర్​లో ఇద్దరు ఉగ్ర అనుచరులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. వారి నుంచి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి. దక్షిణ కశ్మీర్​లో జరిగిన మరో ఘటనలో భారత సైన్యం.. రెండు ఉగ్రవాద రహస్య స్థావరాలను ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనపరచుకున్నట్టు చెప్పారు.

Security Forces of India
భద్రతా బలగాలు

కశ్మీర్​లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్ర అనుచరలను అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇరువురూ నిషేధిత ఉగ్ర సంస్థకు చెందిన హిజ్బుల్​ ముజాహిదీన్​కు చెందినవారిగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరిలో ఒకరు నంబ్లా ఉరీ నివాసి లియాఖత్​ అహ్మద్​ కాగా, మరొకరు బార్మ్​నేట్​ బొనియర్​కు చెందిన అఖ్తర్​ అహ్మద్​ మిర్​ అని వివరించారు.

ఈ ఇద్దరూ స్మగ్లింగ్​, ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రిని ఉగ్రవాదులకు ఏర్పాటు చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: నక్సలైట్ల దుశ్చర్య- ట్రాక్టర్లు, ట్యాంకర్లు దగ్ధం

కుల్గాంలో రెండు ఉగ్రస్థావరాలు ధ్వంసం

దక్షిణ కశ్మీర్​లోని కుల్గాంలో రెండు ఉగ్రవాద రహస్య స్థావరాలను ఛేదించాయి భద్రతా బలగాలు. వాటిని ధ్వంసం చేసి అక్కడున్న భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం తెలిపారు. వాటిలో 7.62 ఎంఎం పీకే మెషీన్​ గన్​, యూఎంజీ, 7.67 ఎంఎం పీకే మెషీన్​ గన్​లు-9, 9ఎంఎం(స్టార్​) పిస్టల్​, మ్యాగజైన్​, 9ఎంఎం పిస్టల్​(విడిగా), 9ఎంఎం పిస్టల్స్ ఆర్​డీఎస్​​-24, రొటేటింగ్​ బోల్ట్​(ఏకే-47), ఏకే-47 రౌండ్స్​, ఓ చిల్లీ గ్రెనేడ్​, 5.56ఎంఎం ఆర్​డీఎస్​లు-32, ఒక ఏకే-47 మ్యాగజైన్​ ఉన్నట్టు పేర్కొన్నారు.

అంతేకాకుండా.. 4-సోలార్​ ప్లేట్లు, 40 ఏకే-ఫైర్​డ్​ కేసులు, 2-కంబాట్​ పౌచ్​లు, 2-స్లీపింగ్​ బ్యాగులు, బుర్ఖా(వెయిల్​), 2-ఆర్మీకి సంబంధించిన చొక్కాలు సహా.. ఇతర వస్తువులూ ఉన్నట్టు చెప్పారు.

ఈ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: చిన్నారుల సరికొత్త నేస్తం 'ఈటీవీ బాలభారత్'​- రేపే ప్రారంభం

కశ్మీర్​లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్ర అనుచరలను అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇరువురూ నిషేధిత ఉగ్ర సంస్థకు చెందిన హిజ్బుల్​ ముజాహిదీన్​కు చెందినవారిగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరిలో ఒకరు నంబ్లా ఉరీ నివాసి లియాఖత్​ అహ్మద్​ కాగా, మరొకరు బార్మ్​నేట్​ బొనియర్​కు చెందిన అఖ్తర్​ అహ్మద్​ మిర్​ అని వివరించారు.

ఈ ఇద్దరూ స్మగ్లింగ్​, ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రిని ఉగ్రవాదులకు ఏర్పాటు చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: నక్సలైట్ల దుశ్చర్య- ట్రాక్టర్లు, ట్యాంకర్లు దగ్ధం

కుల్గాంలో రెండు ఉగ్రస్థావరాలు ధ్వంసం

దక్షిణ కశ్మీర్​లోని కుల్గాంలో రెండు ఉగ్రవాద రహస్య స్థావరాలను ఛేదించాయి భద్రతా బలగాలు. వాటిని ధ్వంసం చేసి అక్కడున్న భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం తెలిపారు. వాటిలో 7.62 ఎంఎం పీకే మెషీన్​ గన్​, యూఎంజీ, 7.67 ఎంఎం పీకే మెషీన్​ గన్​లు-9, 9ఎంఎం(స్టార్​) పిస్టల్​, మ్యాగజైన్​, 9ఎంఎం పిస్టల్​(విడిగా), 9ఎంఎం పిస్టల్స్ ఆర్​డీఎస్​​-24, రొటేటింగ్​ బోల్ట్​(ఏకే-47), ఏకే-47 రౌండ్స్​, ఓ చిల్లీ గ్రెనేడ్​, 5.56ఎంఎం ఆర్​డీఎస్​లు-32, ఒక ఏకే-47 మ్యాగజైన్​ ఉన్నట్టు పేర్కొన్నారు.

అంతేకాకుండా.. 4-సోలార్​ ప్లేట్లు, 40 ఏకే-ఫైర్​డ్​ కేసులు, 2-కంబాట్​ పౌచ్​లు, 2-స్లీపింగ్​ బ్యాగులు, బుర్ఖా(వెయిల్​), 2-ఆర్మీకి సంబంధించిన చొక్కాలు సహా.. ఇతర వస్తువులూ ఉన్నట్టు చెప్పారు.

ఈ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: చిన్నారుల సరికొత్త నేస్తం 'ఈటీవీ బాలభారత్'​- రేపే ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.