ETV Bharat / bharat

త్రిపుర మాజీ ముఖ్యమంత్రిపై దాడి - manik sarkar attacked

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత మాణిక్​ సర్కార్​ సహా ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్​ నాయకులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. భాజపా మద్దతుదార్లే ఈ దాడి చేశారని మాణిక్​ సర్కార్​ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భాజపా ఖండించింది. సీపీఎం మాజీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడి ఉంటారని పేర్కొన్నారు.

attack on manik sarkar, మాణిక్​ సర్కార్​పై దాడి
మాణిక్​ సర్కార్​పై దాడి
author img

By

Published : May 11, 2021, 1:38 PM IST

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్​ సర్కార్​పై దాడి

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్​ సర్కార్​పై సోమవారం పలువురు దాడికి పాల్పడ్డారు. ఇటీవల దాడికి గురైన పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి సంతిర్​బజార్​కు వెళ్లిన మాణిక్​ సర్కార్​ను పలువురు అడ్డగించారు. గో బ్యాక్​ సర్కార్​ అని నినాదాలతో, నల్ల జెండాలు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ క్రమంలో దుండగులు మాణిక్​ సర్కార్​ సహా పరామర్శించేందుకు వచ్చిన సీపీఎం సీనియర్​ నేతలపై రాళ్ల దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్​ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

ఇది వారి పనే..

ఘటనపై స్పందించిన మాణిక్​ సర్కార్​.. ఈ దాడి భాజపా మద్దతుదార్లు చేసినదని ఆరోపించారు.

"ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి. అధికార పార్టీ హస్తం లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయి. సీపీఎం పార్టీ కార్యకర్తలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి."

-మాణిక్​ సర్కార్​, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి

మాణిక్​ సర్కార్​ ఆరోపణలపై త్రిపుర విద్యాశాఖ మంత్రి రతన్​ లాల్​ నాథ్​ స్పందించారు. దాడికి పాల్పడిన వారు భాజపా కార్యకర్తలు కారని.. వారు సీపీఎం మాజీ కార్యకర్తలని పేర్కొన్నారు. 25 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని తప్పుపట్టించిన నేతలపై వారు ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీపీఎం భయాందోళనలు నెలకొల్పేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి : కరోనా టెస్టుకు వెళ్లి.. క్యూలో ఉండగానే ప్రసవం!

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్​ సర్కార్​పై దాడి

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్​ సర్కార్​పై సోమవారం పలువురు దాడికి పాల్పడ్డారు. ఇటీవల దాడికి గురైన పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి సంతిర్​బజార్​కు వెళ్లిన మాణిక్​ సర్కార్​ను పలువురు అడ్డగించారు. గో బ్యాక్​ సర్కార్​ అని నినాదాలతో, నల్ల జెండాలు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ క్రమంలో దుండగులు మాణిక్​ సర్కార్​ సహా పరామర్శించేందుకు వచ్చిన సీపీఎం సీనియర్​ నేతలపై రాళ్ల దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్​ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

ఇది వారి పనే..

ఘటనపై స్పందించిన మాణిక్​ సర్కార్​.. ఈ దాడి భాజపా మద్దతుదార్లు చేసినదని ఆరోపించారు.

"ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి. అధికార పార్టీ హస్తం లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయి. సీపీఎం పార్టీ కార్యకర్తలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి."

-మాణిక్​ సర్కార్​, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి

మాణిక్​ సర్కార్​ ఆరోపణలపై త్రిపుర విద్యాశాఖ మంత్రి రతన్​ లాల్​ నాథ్​ స్పందించారు. దాడికి పాల్పడిన వారు భాజపా కార్యకర్తలు కారని.. వారు సీపీఎం మాజీ కార్యకర్తలని పేర్కొన్నారు. 25 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని తప్పుపట్టించిన నేతలపై వారు ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీపీఎం భయాందోళనలు నెలకొల్పేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి : కరోనా టెస్టుకు వెళ్లి.. క్యూలో ఉండగానే ప్రసవం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.