ETV Bharat / bharat

ముగ్గురు ఓఎన్​జీసీ అధికారుల అపహరణ - ఉల్ఫా ఉగ్ర సంస్థ

అసోం శివసాగర్​ జిల్లాలో ముగ్గురు ఓఎన్​జీసీ అధికారులను కిడ్నాప్​ చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగిందని ఓఎన్​జీసీ తెలిపింది.

ONGC officials, kidnap
ఓఎన్​జీసీ అధికారులు, కిడ్నాప్
author img

By

Published : Apr 21, 2021, 10:21 AM IST

Updated : Apr 21, 2021, 11:40 AM IST

అసోం-నాగాలాండ్​లోని శివసాగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ఓఎన్​జీసీ ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. 'ఉల్ఫా' ఉగ్రసంస్థ ఈ కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ONGC
కిడ్నాప్​నకు గురైన అధికారి

లక్వా ఓన్​జీసీ ప్లాంటు వద్ద నుంచి దుండగులు.. సిబ్బందిని కిడ్నాప్​ చేసి తీసుకెళ్లారని ఓఎన్​జీసీ పేర్కొంది. జూనియర్​ టెక్నీషియన్లు ఎమ్​ ఎమ్​ గొగొయి, రితుల్ సైక్యా, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అలకేశ్ సైక్యా కిడ్నాప్​కు గురైనట్లు ఓన్​జీసీ ప్రతినిధి స్పష్టం చేశారు.

ONGC
కిడ్నాప్​నకు గురైన అధికారి
ONGC
రితుల్ సైక్యా

ఓన్​జీసీకి చెందిన వాహనంలోనే అధికారులను కిడ్నాప్​ చేసిన దుండగులు.. ఆ వాహనాన్ని అసోం-నాగాలాండ్​ సరిహద్దులోని నిమోనగఢ్​ అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే.. కిడ్నాపర్లు నాగాలాండ్​ నుంచి తప్పించుకుని ఉంటారని జిల్లా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదైనట్లు తెలిపిన పోలీసు అధికారులు.. అపహరణకు గురైన వారికోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దుండగులు ఎలాంటి డిమాండ్​లు కోరలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'ఐఎస్​ఐతో సంప్రదింపులు.. ప్రతిపక్షాలకు తిరస్కారాలా?'

అసోం-నాగాలాండ్​లోని శివసాగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ఓఎన్​జీసీ ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. 'ఉల్ఫా' ఉగ్రసంస్థ ఈ కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ONGC
కిడ్నాప్​నకు గురైన అధికారి

లక్వా ఓన్​జీసీ ప్లాంటు వద్ద నుంచి దుండగులు.. సిబ్బందిని కిడ్నాప్​ చేసి తీసుకెళ్లారని ఓఎన్​జీసీ పేర్కొంది. జూనియర్​ టెక్నీషియన్లు ఎమ్​ ఎమ్​ గొగొయి, రితుల్ సైక్యా, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అలకేశ్ సైక్యా కిడ్నాప్​కు గురైనట్లు ఓన్​జీసీ ప్రతినిధి స్పష్టం చేశారు.

ONGC
కిడ్నాప్​నకు గురైన అధికారి
ONGC
రితుల్ సైక్యా

ఓన్​జీసీకి చెందిన వాహనంలోనే అధికారులను కిడ్నాప్​ చేసిన దుండగులు.. ఆ వాహనాన్ని అసోం-నాగాలాండ్​ సరిహద్దులోని నిమోనగఢ్​ అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే.. కిడ్నాపర్లు నాగాలాండ్​ నుంచి తప్పించుకుని ఉంటారని జిల్లా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదైనట్లు తెలిపిన పోలీసు అధికారులు.. అపహరణకు గురైన వారికోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దుండగులు ఎలాంటి డిమాండ్​లు కోరలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'ఐఎస్​ఐతో సంప్రదింపులు.. ప్రతిపక్షాలకు తిరస్కారాలా?'

Last Updated : Apr 21, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.