ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో సరిహద్దు వెంబడి జరిగిన కాల్పులు, పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలో మొత్తం 31 మంది పౌరులు, 39 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని లోక్సభలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.
జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ దశాబ్దాల తరబడి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ చర్యలను మన భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్సభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.