ETV Bharat / bharat

ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ - 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 7:57 PM IST

Updated : Nov 29, 2023, 8:04 PM IST

Telangana Polling Arrangements 2023 : శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఇప్పటికే ఈవీఎంలు సహా సిబ్బందిని సిద్ధం చేశారు. సిబ్బంది ఇవాళ పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ప్రలోభాల కట్టడిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎన్నికల సంఘం.. అందుకు సంబంధించి విస్తృత చర్యలు చేపట్టింది. శాంతిభద్రతలు.. ప్రత్యేకించి సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు.

Telangana Polling Arrangements 2023
Telangana Assembly Elections 2023

శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధం రేపే ఓటింగ్​ ప్రక్రియ

Telangana Polling Arrangements 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ కంటే 90 నిమిషాలు ముందు అంటే ఉదయం 5 గంటలా 30 నిమిషాలకు మాక్ పోలింగ్ చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్(Telangana Polling) కొనసాగుతుంది.

Telangana Elections MLA Candidates Details : శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. బీఆర్ఎస్​ మొత్తం 119 స్థానాల్లో పోటీలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 118 చోట్ల బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీలో నిలవగా.. మిత్రపక్షం జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఎఎం 19, సీపీఐ ఒక స్థానంలో, బీఎస్పీ నుంచి 108 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్‌వాడలో కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు రంగం సిద్ధం - పూర్తైన ఎన్నికల సామగ్రి పంపిణీ

"ప్రతి దానికి ఒక సెక్టార్​ ఆఫీసర్​ ఉంటారు. ముఖ్యంగా అతనే ఆ కేంద్రంలో కోర్టినేట్​ చేస్తారు. పీఓ దగ్గర ఏమైనా సమస్య ఉంటే వారు సెక్టార్​ ఆఫీసర్​తో మాట్లాడతారు. ఈవీఎంలో ఏమైనా సమస్య వస్తే.. ఎక్స్​ట్రా ఈవీఎం ఆయన దగ్గరే ఉంటుంది. వీళ్లకి ఆ కేంద్రంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి."- వికాస్‌రాజ్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

Telangana Polling Centers 2023 : ఓటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో(Polling Centers) కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి రవాణా సదుపాయంతో పాటు 21,686 వీల్ ఛైర్స్ సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి కూడా ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. 1,85,000 మంది పోలింగ్ సిబ్బంది.. 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్, ఇతరులు మొత్తం కలిపి రెండు లక్షలకుపైగా పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను 3803 సెక్టార్లుగా విభజించారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలో పోలింగ్​కు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు.

ఓటరు మహాశయా మేలుకో - ఇకనైనా బద్ధకాన్ని వీడి పోలింగ్ కేంద్రానికి పోటెత్తు

CEO Vikash Raj on Polling Arrangements : రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య(Telangana Voters) 3,26,2,799. అందులో పురుషులు 1,62,98,418 మంది కాగా.. మహిళలు 1,63,01,705 మంది ఓటర్లుగా ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు ఓటరు జాబితాలో 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15,406 కాగా.. ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారి సంఖ్య 9,99,667. పోలింగ్ కోసం ఈవీఎం యంత్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. గరిష్ఠంగా ఎల్బీనగర్‌లో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 72,931 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. 56,592 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తారు.

Problematic Polling Centers in Telangana : రాష్ట్రంలో 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకటికి మించి పోలింగ్ బూత్‌లు ఉన్న 7,571 కేంద్రాల వద్ద బయట కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. పోటీ తీవ్రంగా, గొడవకు అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. మద్యం సరఫరా, పంపిణీ, నిల్వలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎక్సైజ్ శాఖకు స్పష్టం చేశారు.

ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది - ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు : సీఈఓ వికాస్​రాజ్​

దివ్యాంగులతో పాటు 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈసీ హోం ఓటింగ్ అవకాశం కల్పించడంతో 27,178 మంది ఓటర్లు ఇంటివద్ద ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో 80 ఏళ్లు పైబడిన వారు 15,990 మంది ఉండగా.. దివ్యాంగులు 9,459 మంది ఉన్నారు. అత్యవసర సేవల్లో ఉండే వారిలో 1,720 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Telangana Leaders Download Postal Ballot : సర్వీసు ఓటర్లు 10,191 మంది ఎలక్ట్రానిక్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ డౌన్​లోడ్ చేసుకున్నారు. మూడో తేదీ ఉదయం ఎనిమిది గంటల్లోపు ఆ బ్యాలెట్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు చేరాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది 1,48,000 మంది వరకు పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. శాసనసభ ఎన్నికల పోలింగ్‌ దృష్టా గురువారం ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈఓ వికాస్​రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై కార్మిక శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్‌ పరిసరాలు

శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధం రేపే ఓటింగ్​ ప్రక్రియ

Telangana Polling Arrangements 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ కంటే 90 నిమిషాలు ముందు అంటే ఉదయం 5 గంటలా 30 నిమిషాలకు మాక్ పోలింగ్ చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్(Telangana Polling) కొనసాగుతుంది.

Telangana Elections MLA Candidates Details : శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. బీఆర్ఎస్​ మొత్తం 119 స్థానాల్లో పోటీలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 118 చోట్ల బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీలో నిలవగా.. మిత్రపక్షం జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఎఎం 19, సీపీఐ ఒక స్థానంలో, బీఎస్పీ నుంచి 108 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్‌వాడలో కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు రంగం సిద్ధం - పూర్తైన ఎన్నికల సామగ్రి పంపిణీ

"ప్రతి దానికి ఒక సెక్టార్​ ఆఫీసర్​ ఉంటారు. ముఖ్యంగా అతనే ఆ కేంద్రంలో కోర్టినేట్​ చేస్తారు. పీఓ దగ్గర ఏమైనా సమస్య ఉంటే వారు సెక్టార్​ ఆఫీసర్​తో మాట్లాడతారు. ఈవీఎంలో ఏమైనా సమస్య వస్తే.. ఎక్స్​ట్రా ఈవీఎం ఆయన దగ్గరే ఉంటుంది. వీళ్లకి ఆ కేంద్రంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి."- వికాస్‌రాజ్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

Telangana Polling Centers 2023 : ఓటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో(Polling Centers) కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి రవాణా సదుపాయంతో పాటు 21,686 వీల్ ఛైర్స్ సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి కూడా ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. 1,85,000 మంది పోలింగ్ సిబ్బంది.. 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్, ఇతరులు మొత్తం కలిపి రెండు లక్షలకుపైగా పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను 3803 సెక్టార్లుగా విభజించారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలో పోలింగ్​కు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు.

ఓటరు మహాశయా మేలుకో - ఇకనైనా బద్ధకాన్ని వీడి పోలింగ్ కేంద్రానికి పోటెత్తు

CEO Vikash Raj on Polling Arrangements : రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య(Telangana Voters) 3,26,2,799. అందులో పురుషులు 1,62,98,418 మంది కాగా.. మహిళలు 1,63,01,705 మంది ఓటర్లుగా ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు ఓటరు జాబితాలో 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15,406 కాగా.. ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారి సంఖ్య 9,99,667. పోలింగ్ కోసం ఈవీఎం యంత్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. గరిష్ఠంగా ఎల్బీనగర్‌లో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 72,931 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. 56,592 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తారు.

Problematic Polling Centers in Telangana : రాష్ట్రంలో 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకటికి మించి పోలింగ్ బూత్‌లు ఉన్న 7,571 కేంద్రాల వద్ద బయట కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. పోటీ తీవ్రంగా, గొడవకు అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. మద్యం సరఫరా, పంపిణీ, నిల్వలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎక్సైజ్ శాఖకు స్పష్టం చేశారు.

ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది - ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు : సీఈఓ వికాస్​రాజ్​

దివ్యాంగులతో పాటు 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈసీ హోం ఓటింగ్ అవకాశం కల్పించడంతో 27,178 మంది ఓటర్లు ఇంటివద్ద ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో 80 ఏళ్లు పైబడిన వారు 15,990 మంది ఉండగా.. దివ్యాంగులు 9,459 మంది ఉన్నారు. అత్యవసర సేవల్లో ఉండే వారిలో 1,720 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Telangana Leaders Download Postal Ballot : సర్వీసు ఓటర్లు 10,191 మంది ఎలక్ట్రానిక్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ డౌన్​లోడ్ చేసుకున్నారు. మూడో తేదీ ఉదయం ఎనిమిది గంటల్లోపు ఆ బ్యాలెట్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు చేరాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది 1,48,000 మంది వరకు పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. శాసనసభ ఎన్నికల పోలింగ్‌ దృష్టా గురువారం ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈఓ వికాస్​రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై కార్మిక శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్‌ పరిసరాలు

Last Updated : Nov 29, 2023, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.