ETV Bharat / bharat

TSPSC పేపర్‌ లీకేజ్ కేసులో సిట్ నోటీసులు.. రేవంత్ రియాక్షన్ ఏంటంటే?

author img

By

Published : Mar 20, 2023, 1:51 PM IST

Updated : Mar 20, 2023, 5:41 PM IST

SIT Notices to Revanth reddy : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజ్ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తోన్న వారికి సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే రేవంత్‌రెడ్డి మాత్రం తనకు నోటీసులు అందలేదని పేర్కొన్నారు. సిటీ అధికారులు సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లి ఇంటి గోడకు నోటీసులు అంటించారు.

TSPSC పేపర్‌ లీకేజ్ కేసు.. రేవంత్‌రెడ్డికి సిట్ నోటీసులు
TSPSC పేపర్‌ లీకేజ్ కేసు.. రేవంత్‌రెడ్డికి సిట్ నోటీసులు

TSPSC Paper Leakage latest update: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజ్ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతుంది. పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తున్న వారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ లీకేజీ కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. తమ దగ్గర ఉన్న వివరాలు అందచేయాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. గ్రూప్‌- 1లో కొందరికి 100కు పైగా ర్యాంకులు వచ్చాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఒక మండలంలో 100 మందికి పైగా మంచి ర్యాంకులు వచ్చాయని రేవంత్‌ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న వివరాలు అందజేయాలని సిట్‌ పేర్కొంది. మరికొంత మందికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ ఉంది.

ఈ నోటీసులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని స్పష్టం చేశారు. సిట్ నోటీసులకు భయపడేది లేదని వెల్లడించారు. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌కు ఇవ్వనని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే ఆధారాలు ఇస్తామని పేర్కొన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక పోరాటం ఆపమని ధ్వజమెత్తారు. లీకేజీ కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆరోపణ చేశారు.

రేవంత్ ఇంటికి నోటీసులు: మరోవైపు సాయంత్రం 5 గంటల సమయంలో నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. జుబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌ రెడ్డితో కలిసి రేవంత్ ఇంటికి వెళ్లారు. అయితే నోటీసులను తీసుకునేందుకు రేవంత్ కార్యాలయ సిబ్బంది నిరాకరించారు. ఆయన పేరు మీద నోటీసు ఉంటే.. ఆయనకే ఇవ్వాలని సూచించారు. అయితే పోలీసులు మాత్రం రేవంత్ ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఈనెల 23న 11 గంటలకు.. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో సిట్ కార్యాలయానికి రావాలని అందులో సూచించారు.

SIT Notices to Revanth reddy
TSPSC పేపర్‌ లీకేజ్ కేసులో సిట్ నోటీసులు.. రేవంత్ రియాక్షన్ ఏంటంటే?

ఇక ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే పేపర్ లీకేజ్ అయినట్లు సిట్ ఇచ్చిన నివేదికతో... టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు అయ్యాయి. గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. జనవరి 22న నిర్వహించిన ఏఈఈ, ఫ్రిబ్రవరి 26న నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షా పత్రాలు లీకైనట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో... దీంతో ఆ మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

ఈ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పేపర్ లీకేజీపై విచారణ వాయిదా వేయాలని పిటిషనర్‌ న్యాయవాది కోరారు. లీకేజీపై హైకోర్టులో పిటిషన్‌ కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ పిటిషన్ వేయగా.. కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వాదనలు వినిపిస్తారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రశ్నపత్రం లీకేజీ పిటిషన్‌ను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

TSPSC Paper Leakage latest update: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజ్ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతుంది. పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తున్న వారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ లీకేజీ కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. తమ దగ్గర ఉన్న వివరాలు అందచేయాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. గ్రూప్‌- 1లో కొందరికి 100కు పైగా ర్యాంకులు వచ్చాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఒక మండలంలో 100 మందికి పైగా మంచి ర్యాంకులు వచ్చాయని రేవంత్‌ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న వివరాలు అందజేయాలని సిట్‌ పేర్కొంది. మరికొంత మందికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ ఉంది.

ఈ నోటీసులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని స్పష్టం చేశారు. సిట్ నోటీసులకు భయపడేది లేదని వెల్లడించారు. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌కు ఇవ్వనని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే ఆధారాలు ఇస్తామని పేర్కొన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక పోరాటం ఆపమని ధ్వజమెత్తారు. లీకేజీ కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆరోపణ చేశారు.

రేవంత్ ఇంటికి నోటీసులు: మరోవైపు సాయంత్రం 5 గంటల సమయంలో నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. జుబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌ రెడ్డితో కలిసి రేవంత్ ఇంటికి వెళ్లారు. అయితే నోటీసులను తీసుకునేందుకు రేవంత్ కార్యాలయ సిబ్బంది నిరాకరించారు. ఆయన పేరు మీద నోటీసు ఉంటే.. ఆయనకే ఇవ్వాలని సూచించారు. అయితే పోలీసులు మాత్రం రేవంత్ ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఈనెల 23న 11 గంటలకు.. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో సిట్ కార్యాలయానికి రావాలని అందులో సూచించారు.

SIT Notices to Revanth reddy
TSPSC పేపర్‌ లీకేజ్ కేసులో సిట్ నోటీసులు.. రేవంత్ రియాక్షన్ ఏంటంటే?

ఇక ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే పేపర్ లీకేజ్ అయినట్లు సిట్ ఇచ్చిన నివేదికతో... టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు అయ్యాయి. గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. జనవరి 22న నిర్వహించిన ఏఈఈ, ఫ్రిబ్రవరి 26న నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షా పత్రాలు లీకైనట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో... దీంతో ఆ మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

ఈ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పేపర్ లీకేజీపై విచారణ వాయిదా వేయాలని పిటిషనర్‌ న్యాయవాది కోరారు. లీకేజీపై హైకోర్టులో పిటిషన్‌ కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ పిటిషన్ వేయగా.. కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వాదనలు వినిపిస్తారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రశ్నపత్రం లీకేజీ పిటిషన్‌ను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 20, 2023, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.