ఆసుపత్రి నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డిశ్చార్జ్ అయ్యారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు సూచించినట్లు మాలిక్ వెల్లడించారు. గాల్ బ్లాడర్ సమస్యతో మార్చి 30న శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు.
"పవార్(80) ఆరోగ్యంగా ఉన్నారు. మరో ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. 15 రోజులపాటు ఆయన ఆరోగ్యంలో ఏ మార్పు లేకపోతే గాల్ బ్లాడర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది."
-నవాబ్ మాలిక్, ఎన్సీపీ మంత్రి
పిత్తాశయంలో రాళ్లను తొలగించుకోవడానికి మార్చి 30న పవార్.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అత్యవసర ఎండోస్కోపీ చేయించుకున్నారు.
ఇదీ చదవండి: బుద్ధదేవ్ 'గళం'.. వామపక్షాలకు బలమవుతుందా?