ETV Bharat / bharat

ఆసుపత్రి నుంచి శరద్​ పవార్​ డిశ్చార్జి

author img

By

Published : Apr 15, 2021, 1:32 PM IST

శస్త్ర చికిత్స నిమిత్రం ఆసుపత్రిలో చేరిన ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్.. గురువారం డిశ్చార్జి అయ్యారు. ​మరికొన్ని రోజుల పాటు ఆయన ముంబయిలోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు.

sharad pawar
శరద్​ పవార్ డిశ్చార్జి

గాల్​బ్లాడర్​ శస్త్రచికిత్స కోసం ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్.. గురువారం డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్​ నేత, మంత్రి నవాబ్​ మాలిక్​ వెల్లడించారు.

పవార్​కు బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రి వైద్యులు.. శస్త్రచికిత్సను సోమవారం విజయవంతంగా నిర్వహించారు. అనంతరం.. రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనను గురువారం డిశ్చార్జి చేశారని మాలిక్​ తెలిపారు. కొన్ని రోజుల పాటు పవార్​ తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు.

గత నెలలో కడుపునొప్పితో శరద్​ పవార్​ ఆసుపత్రిలో చేరారు. దాంతో మార్చి 30న ఎండోస్కోపీ చేసిన వైద్యులు ఆయన గాల్​బ్లాడర్​లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ రాళ్లను తొలగించారు.

గాల్​బ్లాడర్​ శస్త్రచికిత్స కోసం ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్.. గురువారం డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్​ నేత, మంత్రి నవాబ్​ మాలిక్​ వెల్లడించారు.

పవార్​కు బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రి వైద్యులు.. శస్త్రచికిత్సను సోమవారం విజయవంతంగా నిర్వహించారు. అనంతరం.. రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనను గురువారం డిశ్చార్జి చేశారని మాలిక్​ తెలిపారు. కొన్ని రోజుల పాటు పవార్​ తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు.

గత నెలలో కడుపునొప్పితో శరద్​ పవార్​ ఆసుపత్రిలో చేరారు. దాంతో మార్చి 30న ఎండోస్కోపీ చేసిన వైద్యులు ఆయన గాల్​బ్లాడర్​లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ రాళ్లను తొలగించారు.

ఇదీ చూడండి:ఆ రాష్ట్ర మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్​

ఇదీ చూడండి:పోలింగ్​కు ముందు కాంగ్రెస్​ అభ్యర్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.