హరియాణా రోహ్తక్లో చోరీ చేసేందుకు ఓ ఏటీఎంలోకి వచ్చిన దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు సెక్యూరిటీ గార్డు. అతడి తెగువను చూసి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ జరిగింది..
రోహ్తక్లోని మకరౌలీ గ్రామంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదును దొంగిలించేందుకు దుండగులు వచ్చారు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు వీరేంద్ర సింగ్.. ఏటీఎంలోనే ఉన్నాడు. తుపాకీతో ఏటీఎంలోకి చొరబడిన దొంగపై.. సింగ్ దాడి చేశాడు. వెంటనే దుండగులు సింగ్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం వీరేంద్ర సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి : నిశ్చితార్థం రోజునా శ్మశానంలో విధులు!