ETV Bharat / bharat

'రోహిణి కోర్టు పేలుడు'లో సైంటిస్ట్​ అరెస్ట్​.. సొంతంగా బాంబు తయారు చేసి.. - బాంబు పేలుడు

Rohini Court Blast: దిల్లీలోని రోహిణి కోర్టులో ఇటీవల బాంబు పేలుడు కేసులో ఓ శాస్త్రవేత్తను అరెస్ట్​ చేసింది ప్రత్యేక విభాగం. పొరుగింటి వ్యక్తిని హత్య చేసేందుకు సొంతంగా బాంబు తయారు చేసి కోర్టులో పెట్టినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ఈ కేసులో ఆయనకు సాయం చేసిన మరో నలుగురిని అరెస్ట్​ చేశారు.

Rohini Court blast
రోహిణి కోర్టు పేలుడు
author img

By

Published : Dec 18, 2021, 1:25 PM IST

Rohini Court Blast: దిల్లీలోని రోహిణి కోర్టులో డిసెంబర్​ 9న జరిగిన బాంబు పేలుడు కేసులో పురోగతి సాధించారు ప్రత్యేక విభాగం పోలీసులు. కోర్టు ఆవరణలో బాంబు పెట్టిన ఆరోపణలతో అశోక్​ విహార్​ ప్రాంతానికి చెందిన ఓ శాస్త్రవేత్తను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహాయం చేసిన మరో నలుగురిని సైతం అరెస్ట్​ చేశారు.

కోర్టు విచారణకు హాజరైన తన పొరుగింటి వ్యక్తిని హత్య చేసే ఉద్దేశంతోనే బాంబు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలను రాబట్టేందుకు విచారణ కొనసాగుతోందని చెప్పారు.

ఇదీ జరిగింది..

డిసెంబర్​ 9న రోహిణి కోర్టులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కోర్టు నయిబ్​ గాయపడ్డారు. బాధితుడికి స్థానిక అంబేద్కర్​ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ల్యాప్​టాప్​ బ్యాటరీ పేలి ఉంటుందని ప్రాథమికంగా భావించారు పోలీసులు. అయితే, కోర్టులో ఉద్దేశపూర్వకంగానే టిఫిన్​ బాక్స్​ బాంబును పెట్టినట్లు తేల్చారు. దానిని రిమోట్​ కంట్రోలర్​ ద్వారా ఆపరేట్​ చేసినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రత్యేక విభాగానికి అప్పగించారు. 100కుపైగా సీసీటీవీలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం నిందితుడిని పట్టుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆ రోజు కోర్టు ఆవరణలోని అనుమానిత ప్రాంతాల్లో నిందితుడి చిత్రాలు కనిపించినట్లు చెప్పారు. అతని సమీపంలో ఉన్నవారిలో ఒకరిని పొరుగింటి వ్యక్తిగా గుర్తించారు.

ఇదీ చూడండి:

Rohini Court Blast: దిల్లీ రోహిణీ కోర్టులో పేలుడు.. ఒకరికి గాయాలు

Delhi Court Shootout: కోర్టులో కాల్పుల ఘటనపై సీజేఐ విచారం

Rohini Court Blast: దిల్లీలోని రోహిణి కోర్టులో డిసెంబర్​ 9న జరిగిన బాంబు పేలుడు కేసులో పురోగతి సాధించారు ప్రత్యేక విభాగం పోలీసులు. కోర్టు ఆవరణలో బాంబు పెట్టిన ఆరోపణలతో అశోక్​ విహార్​ ప్రాంతానికి చెందిన ఓ శాస్త్రవేత్తను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహాయం చేసిన మరో నలుగురిని సైతం అరెస్ట్​ చేశారు.

కోర్టు విచారణకు హాజరైన తన పొరుగింటి వ్యక్తిని హత్య చేసే ఉద్దేశంతోనే బాంబు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలను రాబట్టేందుకు విచారణ కొనసాగుతోందని చెప్పారు.

ఇదీ జరిగింది..

డిసెంబర్​ 9న రోహిణి కోర్టులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కోర్టు నయిబ్​ గాయపడ్డారు. బాధితుడికి స్థానిక అంబేద్కర్​ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ల్యాప్​టాప్​ బ్యాటరీ పేలి ఉంటుందని ప్రాథమికంగా భావించారు పోలీసులు. అయితే, కోర్టులో ఉద్దేశపూర్వకంగానే టిఫిన్​ బాక్స్​ బాంబును పెట్టినట్లు తేల్చారు. దానిని రిమోట్​ కంట్రోలర్​ ద్వారా ఆపరేట్​ చేసినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రత్యేక విభాగానికి అప్పగించారు. 100కుపైగా సీసీటీవీలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం నిందితుడిని పట్టుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆ రోజు కోర్టు ఆవరణలోని అనుమానిత ప్రాంతాల్లో నిందితుడి చిత్రాలు కనిపించినట్లు చెప్పారు. అతని సమీపంలో ఉన్నవారిలో ఒకరిని పొరుగింటి వ్యక్తిగా గుర్తించారు.

ఇదీ చూడండి:

Rohini Court Blast: దిల్లీ రోహిణీ కోర్టులో పేలుడు.. ఒకరికి గాయాలు

Delhi Court Shootout: కోర్టులో కాల్పుల ఘటనపై సీజేఐ విచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.