ETV Bharat / bharat

గంగా నదిలో శవాల వెనుక ఉన్నది ఇతడే! - గంగాలో మృతదేహాలు

బిహార్​ గంగా నది పరివాహక ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు వెలుగు చూసిన ఘటన మరువక ముందే.. ఇదే తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తర్​ప్రదేశ్​లోని బారా నగర్​ పంచాయతీ ప్రాంతంలో ఉండే గంగానదిలో శవాలను పారేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతన్ని ఈ విషయంపై ఆరా తీయగా స్థానిక పోలీసులే ఇలా చేయమని చెప్పినట్లు తెలిపాడు.

Ganges River, floating of bodies
గంగా నదిలో శవాల వెనుక ఉన్న వ్యక్తి ఇతడే!
author img

By

Published : May 12, 2021, 2:08 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని బారానగర్​ పంచాయతీ పరిధిలోని గంగానదిలో మృతదేహాలను పారేస్తూ మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. దీనిపై 'ఈటీవీ భారత్' అతడిని ప్రశ్నించగా... స్థానిక పోలీసులే తనని ఈ పని చేయమన్నారని వెల్లడించడం గమనార్హం. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను పారవేసినట్లు చెప్పాడు. నదిలో మరెన్నో మృతదేహాలను పారవేయమని పోలీసులు తనని ఆదేశించినట్లు వివరించాడు. అతడి వివరాలు అడగ్గా.. తన పేరు బిహారి సా అని.. నాన్న పేరు దెహారి అని చెప్పుకొచ్చాడు.

గంగా నదిలో శవాల వెనుక ఉన్న వ్యక్తి ఇతడే!

ఘటనాస్థలి నుంచి మీడియా వెళ్లిన వెంటనే మరిన్ని శవాలను నదిలో పారవేస్తానని చెప్పాడు. బిహార్​లోని బక్సర్ జిల్లాలో గంగా నది ఒడ్డున పెద్దఎత్తున మృతదేహాలు బయటపడ్డాయి. అవి కొవిడ్​తో మరణించిన వారివి అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఘటనే బారానగర్​లో జరగడం వల్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

బక్సర్​ ఘటనపై అక్కడి కలెక్టర్​ వివరణ ఇచ్చారు. శవాలను కాల్చడానికి కట్టెలు లేక, ఆర్థిక సమస్యలతో పేదలు అంత్యక్రియలు చేయలేక ఇలా పడేశారని తెలిపారు. అలా చేయడం తప్పు అని ఆయన చెప్పారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని గంగా పరివాహక ప్రాంతాలైన బల్లియా, గాజీపుర్​లో మంగళవారం మరిన్ని మృతిదేహాలు వెలుగు చూశాయి. ఇలా నది నుంచి 71పైగా శవాలను బయటకు తీసినట్లు బిహార్​ మంత్రి సంజయ్​ కుమార్​ ఝా తెలిపారు. వాటికి అంతిమసంస్కారాలు నిర్వహించినట్లు వివరించారు.

ఇవీ చూడండి:

గంగానదిలో భారీగా మృతదేహాలు.. ఏం జరిగింది?

'గంగానదిలో మృతదేహాల'పై కేంద్రం చర్యలు

ఉత్తర్​ప్రదేశ్​లోని బారానగర్​ పంచాయతీ పరిధిలోని గంగానదిలో మృతదేహాలను పారేస్తూ మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. దీనిపై 'ఈటీవీ భారత్' అతడిని ప్రశ్నించగా... స్థానిక పోలీసులే తనని ఈ పని చేయమన్నారని వెల్లడించడం గమనార్హం. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను పారవేసినట్లు చెప్పాడు. నదిలో మరెన్నో మృతదేహాలను పారవేయమని పోలీసులు తనని ఆదేశించినట్లు వివరించాడు. అతడి వివరాలు అడగ్గా.. తన పేరు బిహారి సా అని.. నాన్న పేరు దెహారి అని చెప్పుకొచ్చాడు.

గంగా నదిలో శవాల వెనుక ఉన్న వ్యక్తి ఇతడే!

ఘటనాస్థలి నుంచి మీడియా వెళ్లిన వెంటనే మరిన్ని శవాలను నదిలో పారవేస్తానని చెప్పాడు. బిహార్​లోని బక్సర్ జిల్లాలో గంగా నది ఒడ్డున పెద్దఎత్తున మృతదేహాలు బయటపడ్డాయి. అవి కొవిడ్​తో మరణించిన వారివి అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఘటనే బారానగర్​లో జరగడం వల్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

బక్సర్​ ఘటనపై అక్కడి కలెక్టర్​ వివరణ ఇచ్చారు. శవాలను కాల్చడానికి కట్టెలు లేక, ఆర్థిక సమస్యలతో పేదలు అంత్యక్రియలు చేయలేక ఇలా పడేశారని తెలిపారు. అలా చేయడం తప్పు అని ఆయన చెప్పారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని గంగా పరివాహక ప్రాంతాలైన బల్లియా, గాజీపుర్​లో మంగళవారం మరిన్ని మృతిదేహాలు వెలుగు చూశాయి. ఇలా నది నుంచి 71పైగా శవాలను బయటకు తీసినట్లు బిహార్​ మంత్రి సంజయ్​ కుమార్​ ఝా తెలిపారు. వాటికి అంతిమసంస్కారాలు నిర్వహించినట్లు వివరించారు.

ఇవీ చూడండి:

గంగానదిలో భారీగా మృతదేహాలు.. ఏం జరిగింది?

'గంగానదిలో మృతదేహాల'పై కేంద్రం చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.