కాంగ్రెస్ అసంతృప్త నేతలు(జీ-23) జమ్ముకశ్మీర్లో ఏర్పాటు చేసిన 'శాంతి సమ్మేళన్' కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. తాను రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యాను కానీ.. రాజకీయాల్లోంచి కాదన్నారు. జమ్ముకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చేంతవరకూ, కశ్మీర్లోని స్థానికుల ఉద్యోగాలు, హక్కుల కోసం పోరాడతానన్నారు.
" నేను రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యాను.. కానీ రాజకీయాల నుంచి కాదు. చివరి శ్వాస వరకూ దేశం కోసం సేవ చేస్తా. ప్రజల హక్కుల కోసం పోరాడతా."
-- గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఈ కార్యక్రమంలో కపిల్ సిబల్, మనీశ్ తివారీ, భూపేంద్ర సింగ్ హూడా, రాజ్ బబ్బర్, ఆనంద్ శర్మ.. పాల్గొన్నారు.
2019 ఆగస్ట్ 5న జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదాను రద్దు చేసినప్పుడు.. 'మనం మన అస్తిత్వాన్ని కోల్పోయాం. కానీ మళ్లీ రాష్ట్ర హోదా వచ్చేంత వరకూ పోరాడదాం.' అని ఆజాద్ అన్నారు.
ఇదీ చదవండి : అందరినీ గౌరవించటమే కాంగ్రెస్ బలం: ఆజాద్