ETV Bharat / bharat

మామిడి పండ్లకు రికార్డ్​ ధర.. 50 ఏళ్లలోనే అత్యధికం!

author img

By

Published : Feb 12, 2022, 10:45 AM IST

సాధారణంగా మార్కెట్లో మామిడి పండ్ల ధర ఎంత ఉంటుంది? కిలోకి గరిష్ఠంగా రెండు వందలు ఉండొచ్చు. అదే పెట్టెకు వెయ్యి, రెండు వేలు పలుకుతుంది. కానీ, మహారాష్ట్రలోని పుణె మార్కెట్లో ఒక్క ట్రే.. ఏకంగా రూ.31వేలు పలికింది. మార్కెట్​ 50 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం కావటం గమనార్హం. ఇంతకి ఆ మామిడి పండ్లలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?

mangoes
మామిడిపళ్లు

మహారాష్ట్రలోని పుణె మార్కెట్​లో ఈ సీజన్​లో తొలిసారి వచ్చిన మామిడి పండ్లు రికార్డ్​ ధర పలికాయి. ఓ యజమాని తన దుకాణానికి వచ్చిన మామిడ పండ్ల పెట్టెను వేలం వేయగా.. రూ.31,000 అమ్ముడుపోయింది. మార్కెట్​ యాభై ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక ధరగా స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

mangoess
మామిడిపళ్ల పెట్టెతో వ్యాపారులు

వేలంపాట ఎందుకు?

పుణె వ్యాపారులు తమ దుకాణాలకు సీజన్​లో వచ్చిన మొదటి మామిడి పండ్ల పెట్టెకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. సీజన్​ మొత్తం వ్యాపారం బాగా జరగాలని దేవుడిని ప్రార్థిస్తారు. మామిడిపండ్ల పెట్టెకు పూలదండ వేసి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత వేలం పాట నిర్వహిస్తారు. ఆ వేలం బట్టే తమ వ్యాపారం ఆధారపడి ఉంటుందని పుణె వ్యాపారులు నమ్ముతారు.

owner
పూజ చేస్తున్న యజమాని యువరాజ్​

దేవ్​ఘడ్​ రత్నగిరి నుంచి మొదటి మామిడి పండ్ల పెట్టె... శుక్రవారం పుణె ఏపీఎంసీ మార్కెట్​ వ్యాపారి యువరాజ్​ కచి దుకాణానికి వచ్చింది. యజమాని యువరాజ్​ ఆ పెట్టెపై వేలంపాట నిర్వహించారు. ఐదువేల దగ్గర మొదలైన వేలం రూ.31,000కు చేరుకుంది.

"నా దుకాణానికి ఈ సీజనల్​లో మొదటి మామిడిపండ్ల పెట్టె వచ్చింది. ఏటా నిర్వహించే వేలం లాగే ఈ ఏడాది నిర్వహించా. ఎన్నడూలేనంతగా రూ.31,000కు పెట్టె అమ్ముడుపోయింది. కరోనా మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాలు లాభాలు లేక నష్టపోయా. అయితే ఇప్పుడు పరిస్ధితులు కాస్త మెరుగుపడ్డాయి అందుకే మామిడిపండ్లు ఎక్కువ రేటు ఉన్నా.. తెచ్చి అమ్ముతున్నాను."

-యువరాజ్,​ వ్యాపారి

ఇదీ చదవండి: జూ పార్కులో రెండు అరుదైన కోతులు అపహరణ.. కంచె కట్​ చేసి..

మహారాష్ట్రలోని పుణె మార్కెట్​లో ఈ సీజన్​లో తొలిసారి వచ్చిన మామిడి పండ్లు రికార్డ్​ ధర పలికాయి. ఓ యజమాని తన దుకాణానికి వచ్చిన మామిడ పండ్ల పెట్టెను వేలం వేయగా.. రూ.31,000 అమ్ముడుపోయింది. మార్కెట్​ యాభై ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక ధరగా స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

mangoess
మామిడిపళ్ల పెట్టెతో వ్యాపారులు

వేలంపాట ఎందుకు?

పుణె వ్యాపారులు తమ దుకాణాలకు సీజన్​లో వచ్చిన మొదటి మామిడి పండ్ల పెట్టెకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. సీజన్​ మొత్తం వ్యాపారం బాగా జరగాలని దేవుడిని ప్రార్థిస్తారు. మామిడిపండ్ల పెట్టెకు పూలదండ వేసి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత వేలం పాట నిర్వహిస్తారు. ఆ వేలం బట్టే తమ వ్యాపారం ఆధారపడి ఉంటుందని పుణె వ్యాపారులు నమ్ముతారు.

owner
పూజ చేస్తున్న యజమాని యువరాజ్​

దేవ్​ఘడ్​ రత్నగిరి నుంచి మొదటి మామిడి పండ్ల పెట్టె... శుక్రవారం పుణె ఏపీఎంసీ మార్కెట్​ వ్యాపారి యువరాజ్​ కచి దుకాణానికి వచ్చింది. యజమాని యువరాజ్​ ఆ పెట్టెపై వేలంపాట నిర్వహించారు. ఐదువేల దగ్గర మొదలైన వేలం రూ.31,000కు చేరుకుంది.

"నా దుకాణానికి ఈ సీజనల్​లో మొదటి మామిడిపండ్ల పెట్టె వచ్చింది. ఏటా నిర్వహించే వేలం లాగే ఈ ఏడాది నిర్వహించా. ఎన్నడూలేనంతగా రూ.31,000కు పెట్టె అమ్ముడుపోయింది. కరోనా మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాలు లాభాలు లేక నష్టపోయా. అయితే ఇప్పుడు పరిస్ధితులు కాస్త మెరుగుపడ్డాయి అందుకే మామిడిపండ్లు ఎక్కువ రేటు ఉన్నా.. తెచ్చి అమ్ముతున్నాను."

-యువరాజ్,​ వ్యాపారి

ఇదీ చదవండి: జూ పార్కులో రెండు అరుదైన కోతులు అపహరణ.. కంచె కట్​ చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.