ETV Bharat / bharat

ఎగ్జిట్​పోల్స్​: పుదుచ్చేరిలో అధికారం ఎన్​డీఏదే!

author img

By

Published : Apr 29, 2021, 9:10 PM IST

పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో రానుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. మరోసారి అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్‌ యత్నాలు ఫలించవని తెలిపాయి. సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ ప్రభావం ఏ మాత్రం ఉండదని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి.

puducheri exit polls results
పుదుచ్చేరి ఎగ్టిట్​ పోల్స్​ ఫలితాలు

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్​డీఏ అధికారం చేపట్టే అవకాశం ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. అన్నాడీఎంకే, భాజపా, రంగస్వామి కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా..

33 స్థానాలున్న పుదుచ్చేరి శాసనసభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 16 కాగా.. ఎన్​డీఏకు 18 స్థానాలు, కాంగ్రెస్‌కు 12 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సర్వే వెల్లడించింది. ఇతరులకు ఒక్క స్థానం కూడా రాదని వెల్లడించింది.

రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్..

పుదుచ్చేరిలో భాజపా కూటమిదే అధికారమని రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్​ సర్వే అంచనా వేసింది. ఎన్​డీఏ 16 నుంచి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 11 నుంచి 13 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

ఏబీపీ-సీ ఓటర్‌..

ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే ఏన్డీఏ కూటమికి 19 నుంచి 23 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 6 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. ఇతరులకు 1 నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

పోల్‌ స్టార్ట్‌..

పోల్‌ స్టార్ట్‌ సర్వే కూడా ఎన్​డీఏనే అధికారంలోకి వస్తుందంటూ సర్వేను వెల్లడించింది. ఎన్​డీఏకు 17 నుంచి 19 స్థానాలు... కాంగ్రెస్‌కు 11 నుంచి 13 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

ఇదీ చూడండి: ఎన్నికల్లో.. కమల బలమా? విపక్ష గళమా?

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్​డీఏ అధికారం చేపట్టే అవకాశం ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. అన్నాడీఎంకే, భాజపా, రంగస్వామి కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా..

33 స్థానాలున్న పుదుచ్చేరి శాసనసభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 16 కాగా.. ఎన్​డీఏకు 18 స్థానాలు, కాంగ్రెస్‌కు 12 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సర్వే వెల్లడించింది. ఇతరులకు ఒక్క స్థానం కూడా రాదని వెల్లడించింది.

రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్..

పుదుచ్చేరిలో భాజపా కూటమిదే అధికారమని రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్​ సర్వే అంచనా వేసింది. ఎన్​డీఏ 16 నుంచి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 11 నుంచి 13 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

ఏబీపీ-సీ ఓటర్‌..

ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే ఏన్డీఏ కూటమికి 19 నుంచి 23 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 6 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. ఇతరులకు 1 నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

పోల్‌ స్టార్ట్‌..

పోల్‌ స్టార్ట్‌ సర్వే కూడా ఎన్​డీఏనే అధికారంలోకి వస్తుందంటూ సర్వేను వెల్లడించింది. ఎన్​డీఏకు 17 నుంచి 19 స్థానాలు... కాంగ్రెస్‌కు 11 నుంచి 13 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

ఇదీ చూడండి: ఎన్నికల్లో.. కమల బలమా? విపక్ష గళమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.