ETV Bharat / bharat

లిజ్​ ట్రస్​తో ఫోన్​లో మాట్లాడిన మోదీ.. రాణి మృతికి సంతాపం - ఎలిజబెత్​ మరణం భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఇటీవల బ్రిటన్​ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాణి ఎలిజబెత్-​2 మృతి పట్ల సంతాపం తెలియజేశారు. త్వరలో నేతలిద్దరూ ప్రత్యక్షంగా సమావేశం కానున్నారు.

Prime Minister Narendra liz Truss Modi
Prime Minister Narendra Modi spoke on phone today with British PM Elizabeth Truss
author img

By

Published : Sep 10, 2022, 8:09 PM IST

బ్రిటన్​ నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్​ ట్రస్​తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాణి ఎలిజబెత్​-2 మృతి పట్ల బ్రిటన్ రాజ కుటుంబానికి, యూకే ప్రజలకు భారత ప్రజల తరపున మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానిగా ఎన్నికైనందుకు ట్రస్​కు అభినందనలు తెలిపారు. యూకే విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల దైపాక్షిక సంబంధాల విషయంలో ఆమె చేసిన కృషిని అభినందించారు. త్వరలో తాము ప్రత్యక్షంగా సమావేశం కానున్నట్టు ఇరు దేశాల నేతలు వెల్లడించారు.

భారత్​-యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపరచడానికి ఇరు దేశాల నేతలు కట్టుబడి ఉన్నారని భారత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2030 రోడ్‌మ్యాప్ అమలులో పురోగతి, కొనసాగుతున్న ఎఫ్​టీఏ చర్చలు, రక్షణ-భద్రత సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక ఆసక్తికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారని తెలిపింది.

బ్రిటన్​ నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్​ ట్రస్​తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాణి ఎలిజబెత్​-2 మృతి పట్ల బ్రిటన్ రాజ కుటుంబానికి, యూకే ప్రజలకు భారత ప్రజల తరపున మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానిగా ఎన్నికైనందుకు ట్రస్​కు అభినందనలు తెలిపారు. యూకే విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల దైపాక్షిక సంబంధాల విషయంలో ఆమె చేసిన కృషిని అభినందించారు. త్వరలో తాము ప్రత్యక్షంగా సమావేశం కానున్నట్టు ఇరు దేశాల నేతలు వెల్లడించారు.

భారత్​-యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపరచడానికి ఇరు దేశాల నేతలు కట్టుబడి ఉన్నారని భారత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2030 రోడ్‌మ్యాప్ అమలులో పురోగతి, కొనసాగుతున్న ఎఫ్​టీఏ చర్చలు, రక్షణ-భద్రత సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక ఆసక్తికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారని తెలిపింది.

ఇవీ చదవండి: భారత్​లో బ్రిటన్​ హోంమంత్రి భూముల ఆక్రమణ.. ఎక్కడంటే?

ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.