ETV Bharat / bharat

'ఆ ప్రభుత్వాల హయాంలో రక్షణ రంగ సంస్కరణల ఊసే లేదు'

author img

By

Published : Mar 12, 2022, 3:31 PM IST

PM Modi roadshow: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో భద్రతాపరమైన సంస్కరణలు అవసరం ఉన్నా.. ఈ దిశగా గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ నూతన భవనాన్ని జాతికి అంకితం చేశారు.

PM Modi roadshow
PM Modi roadshow

PM Modi in Gujarat: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో భద్రతాపరమైన సంస్కరణలేవీ ప్రవేశపెట్టలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. అవసరం ఉన్నప్పటికీ.. ఈ దిశగా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. గుజరాత్ గాంధీనగర్​లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. భద్రతా దళాలకు అన్నిరకాలుగా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాధారణ ప్రజల్లో పోలీసుల పట్ల సదాభిప్రాయం లేదని.. దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

PM Modi gujarat visit
రాష్ట్రీయ రక్షా వర్సిటీలో ప్రధాని, అమిత్​షా, సీఎం భూపేంద్ర పటేల్​
PM Modi gujarat visit
మోదీ కార్యక్రమంలో సభికులు

రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ(ఆర్ఆర్​యూ)పై ఎన్నో అంచనాలు ఉన్నాయని మోదీ అన్నారు. యూనివర్సిటీలు, కళాశాలలు అభివృద్ధిలో విశేషంగా ఉపయోగపడతాయని చెప్పారు. 60ఏళ్ల క్రితం అహ్మదాబాద్​లో ఓ వ్యాపారి ప్రారంభించిన ఫార్మసీ.. గుజరాత్​ను ఫార్మా హబ్​గా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఏర్పాటైన ఐఐఎం ఇప్పుడు ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలను తయారుచేస్తోందన్నారు. అదేవిధంగా ఆర్ఆర్​యూ సైతం రక్షణ రంగంలో దిగ్గజ లీడర్లను తయారుచేయాలని ఆకాంక్షించారు.

PM Modi gujarat visit
విద్యార్థులు, అధికారులు

రోడ్​షో..

అంతకుముందు, గాంధీనగర్​ దహేగామ్​లో రోడ్​ షో నిర్వహించారు మోదీ. అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంతో నిర్వహించిన ఈ రోడ్​ షోకు జనం భారీగా తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపుల హాజరైన ప్రజలకు అభివాదం చేసుకుంటూ రక్షా శక్తి వర్సిటీకి వెళ్లిన ప్రధాని.. రాష్ట్రీయ రక్షా వర్సిటీ నూతన భవనాన్ని జాతికి అంకితం చేశారు.

PM Modi gujarat visit
రాష్ట్రీయ రక్షా వర్సిటీ భవనం జాతికి అంకితం చేస్తున్న మోదీ
PM Modi gujarat visit
రాష్ట్రీయ రక్షా వర్సిటీ భవనం జాతికి అంకితం చేసిన ప్రధాని

ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర హోమంత్రి అమిత్​ షా, గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.​

PM Modi gujarat visit
రోడ్​ షోలో ప్రధాని నరేంద్ర మోదీ

ఇదీ చూడండి: 'అభివృద్ధికే వారి ఓటు- అందుకే భాజపాకు అధికారం'

PM Modi in Gujarat: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో భద్రతాపరమైన సంస్కరణలేవీ ప్రవేశపెట్టలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. అవసరం ఉన్నప్పటికీ.. ఈ దిశగా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. గుజరాత్ గాంధీనగర్​లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. భద్రతా దళాలకు అన్నిరకాలుగా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాధారణ ప్రజల్లో పోలీసుల పట్ల సదాభిప్రాయం లేదని.. దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

PM Modi gujarat visit
రాష్ట్రీయ రక్షా వర్సిటీలో ప్రధాని, అమిత్​షా, సీఎం భూపేంద్ర పటేల్​
PM Modi gujarat visit
మోదీ కార్యక్రమంలో సభికులు

రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ(ఆర్ఆర్​యూ)పై ఎన్నో అంచనాలు ఉన్నాయని మోదీ అన్నారు. యూనివర్సిటీలు, కళాశాలలు అభివృద్ధిలో విశేషంగా ఉపయోగపడతాయని చెప్పారు. 60ఏళ్ల క్రితం అహ్మదాబాద్​లో ఓ వ్యాపారి ప్రారంభించిన ఫార్మసీ.. గుజరాత్​ను ఫార్మా హబ్​గా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఏర్పాటైన ఐఐఎం ఇప్పుడు ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలను తయారుచేస్తోందన్నారు. అదేవిధంగా ఆర్ఆర్​యూ సైతం రక్షణ రంగంలో దిగ్గజ లీడర్లను తయారుచేయాలని ఆకాంక్షించారు.

PM Modi gujarat visit
విద్యార్థులు, అధికారులు

రోడ్​షో..

అంతకుముందు, గాంధీనగర్​ దహేగామ్​లో రోడ్​ షో నిర్వహించారు మోదీ. అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంతో నిర్వహించిన ఈ రోడ్​ షోకు జనం భారీగా తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపుల హాజరైన ప్రజలకు అభివాదం చేసుకుంటూ రక్షా శక్తి వర్సిటీకి వెళ్లిన ప్రధాని.. రాష్ట్రీయ రక్షా వర్సిటీ నూతన భవనాన్ని జాతికి అంకితం చేశారు.

PM Modi gujarat visit
రాష్ట్రీయ రక్షా వర్సిటీ భవనం జాతికి అంకితం చేస్తున్న మోదీ
PM Modi gujarat visit
రాష్ట్రీయ రక్షా వర్సిటీ భవనం జాతికి అంకితం చేసిన ప్రధాని

ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర హోమంత్రి అమిత్​ షా, గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.​

PM Modi gujarat visit
రోడ్​ షోలో ప్రధాని నరేంద్ర మోదీ

ఇదీ చూడండి: 'అభివృద్ధికే వారి ఓటు- అందుకే భాజపాకు అధికారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.