పోరాట యోధులను గౌరవించే విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిచేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వీరులకు ఇంతకాలం గౌరవం దక్కకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
ప్రముఖ పోరాట యోధుడు సుహేల్ దేవ్ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహ ప్రతిష్ఠకు శంకుస్థాపన చేశారు మోదీ. ఉత్తర్ప్రదేశ్లోని బహ్రైచ్లో జరిగిన ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్ వంటి నేతలకు తగిన గౌరవం ఇవ్వలేదని గత ప్రభుత్వాలపై మండిపడ్డారు.
"పోరాట యోధులకు గత ప్రభుత్వాలు తగిన గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వలేదు. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. ఆ తప్పులను మా ప్రభుత్వం సరిచేస్తోంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రాజ్భర్ సంఘంలో ప్రముఖుడు రాజా సుహేల్దేవ్. 1033లో చిత్తోరా సరస్సు తీరం వద్ద.. తమపైకి దండయాత్రకు వచ్చిన ఘాజీ సయ్యద్ సలార్ మసూద్పై యుద్ధం చేసి గెలిచారు.
అభివృద్ధి పనులు...
శ్రావస్తి, చిత్తోరా సరస్సు సుందరీకరణకు సంబంధించిన పనులకు పచ్చజెండా ఊపారు మోదీ. దీనితో పాటు బహ్రైచ్లో సుహేల్దేవ్ పేరుతో వైద్య కళాశాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.
ఇదీ చూడండి:- మరో రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్న మోదీ!