ఒడిశాలోని కొరాపుత్ జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ వెళ్లే ఆక్సిజన్ సిలిండర్ల వాహనంలో 1,277 కిలోల గంజాయిని ఉత్తర్ప్రదేశ్కు తరలించేందుకు ప్రయత్నించగా కొరాపుత్లో పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. కోటి పది లక్షల వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో పంజాబ్ లూథియానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
"ఆక్సిజన్ సిలిండర్లను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నౌకాశ్రయంలో లోడ్ చేసుకున్నారు. దిల్లీ తరలించే క్రమంలో ఒడిశాలోని కొరాపుత్లో గంజాయిని వాహనంలోకి ఎక్కించారు. దానిని ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో డెలివరీ చేసేందుకు ప్రణాళిక రచించారు. ఒడిశా కొరాపుత్ జిల్లాలోని జయపుర్ ఘాట్ రోడ్లో వెళుతున్న క్రమంలో ట్రక్కును పట్టుకున్నా. "
- ఆదిత్య మహాకుర్, జయపుర్ సదర్ స్టేషన్ అధికారి.
ఈ తరలింపుకు సంబంధించి స్థానిక సరఫరాదారులను గుర్తించేందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని మహాకుర్ తెలిపారు.
ఇదీ చూడండి: Rape: 8 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!