ETV Bharat / bharat

పుల్వామా అమరులకు ప్రముఖుల నివాళి

పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు అయిన సందర్భంగా అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. జవాన్ల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.

author img

By

Published : Feb 14, 2021, 9:49 AM IST

Updated : Feb 14, 2021, 11:47 AM IST

Pulwama terror attack
పుల్వామా అమరులకు ప్రముఖుల నివాళి

భద్రతా బలగాలపై జమ్ముకశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ఆదివారంతో రెండేళ్లు పూర్తి అయ్యింది. యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో 40మంది సీఆర్పీఎఫ్​ జవాన్లు అమరులయ్యారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడి ఘటనను గుర్తు చేసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల శౌర్యం, త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదని ట్వీట్​ చేశారు.

  • I bow down to the brave martyrs who lost their lives in the gruesome Pulwama attack on this day in 2019.

    India will never forget their exceptional courage and supreme sacrifice.

    — Amit Shah (@AmitShah) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రక్షణ మంత్రి నివాళులు..

2019 పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. దేశం కోసం వారు చేసిన సేవలను, త్యాగాన్ని భారత్​ ఎన్నటికీ మరవదని తెలిపారు.

నడ్డా నివాళులు..

పుల్వామా అమరవీరులకు నివాళులర్పించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

  • जम्मू कश्मीर के पुलवामा में हुए आतंकी हमले में शहीद होने वाले माँ भारती के वीर सपूतों को कोटि-कोटि नमन।

    आपके अदम्य साहस, वीरता व शौर्य का राष्ट्र सदैव ऋणी रहेगा।

    — Jagat Prakash Nadda (@JPNadda) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" జమ్ముకశ్మీర్​ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన భారతమాత ముద్దుబిడ్డలకు నా నివాళులు. వారి ధైర్య సాహసాలకు ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది."

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.

రాహుల్​ నివాళులు..

పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దేశం వారికి రుణపడి ఉంటుందని ట్వీట్​ చేశారు.

  • पुलवामा हमले में शहीद हुए वीर सैनिकों को श्रद्धांजलि और उनके परिवारों को नमन।

    देश आपका ऋणी है।

    — Rahul Gandhi (@RahulGandhi) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా నేత శివరాజ్​ సింగ్​ చౌహాన్​ కూడా జవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదన్నారు.

సీఆర్పీఎఫ్​ నివాళులు..

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించింది సీఆర్పీఎఫ్​. దాడి ఘటనాస్థలిలోని స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించారు అధికారులు.

జవాన్ల జ్ఞాపకార్థం గత ఏడాది పుల్వామాలోని దాడి ప్రాంతంలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు.

Pulwama terror attack
స్మారకం వద్ద నివాళులర్పిస్తున్న సీఆర్పీఎఫ్​ అధికారులు
Pulwama terror attack
స్మారకంపై పుల్వామా అమరుల పేర్లు

ఆత్మాహుతి దాడి..

2019, ఫిబ్రవరి 14న.. 2,500మందితో 75 బస్సుల సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​ జమ్ము నుంచి శ్రీనగర్​ వెళుతున్న క్రమంలో​ పుల్వామాలో దాడి జరిగింది. ఐఈడీలు నిండిన కారుతో అదిల్​ అహ్మద్​ దార్​ అనే ఉగ్రవాది దాడి చేశాడు. ఈ దుర్ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనేని పాకిస్థాన్​కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్​ ప్రకటించింది.

Pulwama terror attack
పుల్వామా అమర జవాన్లకు నివాళులు

ఇవీ చూడండి: జమ్ముకశ్మీర్​లో బాంబుదాడి, 40 మంది జవాన్లు మృతి

పుల్వామా అమరుల గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు

భద్రతా బలగాలపై జమ్ముకశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ఆదివారంతో రెండేళ్లు పూర్తి అయ్యింది. యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో 40మంది సీఆర్పీఎఫ్​ జవాన్లు అమరులయ్యారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడి ఘటనను గుర్తు చేసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల శౌర్యం, త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదని ట్వీట్​ చేశారు.

  • I bow down to the brave martyrs who lost their lives in the gruesome Pulwama attack on this day in 2019.

    India will never forget their exceptional courage and supreme sacrifice.

    — Amit Shah (@AmitShah) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రక్షణ మంత్రి నివాళులు..

2019 పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. దేశం కోసం వారు చేసిన సేవలను, త్యాగాన్ని భారత్​ ఎన్నటికీ మరవదని తెలిపారు.

నడ్డా నివాళులు..

పుల్వామా అమరవీరులకు నివాళులర్పించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

  • जम्मू कश्मीर के पुलवामा में हुए आतंकी हमले में शहीद होने वाले माँ भारती के वीर सपूतों को कोटि-कोटि नमन।

    आपके अदम्य साहस, वीरता व शौर्य का राष्ट्र सदैव ऋणी रहेगा।

    — Jagat Prakash Nadda (@JPNadda) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" జమ్ముకశ్మీర్​ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన భారతమాత ముద్దుబిడ్డలకు నా నివాళులు. వారి ధైర్య సాహసాలకు ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది."

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.

రాహుల్​ నివాళులు..

పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దేశం వారికి రుణపడి ఉంటుందని ట్వీట్​ చేశారు.

  • पुलवामा हमले में शहीद हुए वीर सैनिकों को श्रद्धांजलि और उनके परिवारों को नमन।

    देश आपका ऋणी है।

    — Rahul Gandhi (@RahulGandhi) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా నేత శివరాజ్​ సింగ్​ చౌహాన్​ కూడా జవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదన్నారు.

సీఆర్పీఎఫ్​ నివాళులు..

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించింది సీఆర్పీఎఫ్​. దాడి ఘటనాస్థలిలోని స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించారు అధికారులు.

జవాన్ల జ్ఞాపకార్థం గత ఏడాది పుల్వామాలోని దాడి ప్రాంతంలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు.

Pulwama terror attack
స్మారకం వద్ద నివాళులర్పిస్తున్న సీఆర్పీఎఫ్​ అధికారులు
Pulwama terror attack
స్మారకంపై పుల్వామా అమరుల పేర్లు

ఆత్మాహుతి దాడి..

2019, ఫిబ్రవరి 14న.. 2,500మందితో 75 బస్సుల సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​ జమ్ము నుంచి శ్రీనగర్​ వెళుతున్న క్రమంలో​ పుల్వామాలో దాడి జరిగింది. ఐఈడీలు నిండిన కారుతో అదిల్​ అహ్మద్​ దార్​ అనే ఉగ్రవాది దాడి చేశాడు. ఈ దుర్ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనేని పాకిస్థాన్​కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్​ ప్రకటించింది.

Pulwama terror attack
పుల్వామా అమర జవాన్లకు నివాళులు

ఇవీ చూడండి: జమ్ముకశ్మీర్​లో బాంబుదాడి, 40 మంది జవాన్లు మృతి

పుల్వామా అమరుల గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు

Last Updated : Feb 14, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.