ETV Bharat / bharat

'ఫోన్​లో అమ్మ జ్ఞాపకాలు.. ఎలాగైనా తెచ్చివ్వండి' - అమ్మ ఫోన్​ తెచ్చివ్వాలని చిన్నారి లేఖ

తన తల్లి గుర్తులన్నీ ఉన్న ఫోన్​ను ఎలాగైనా పట్టుకొని, తనకు అప్పగించాలని ఓ చిన్నారి జిల్లా కలెక్టర్​కు లేఖ రాసింది. ఇటీవల ఆమె తల్లి కరోనాతో మరణించారు. ఈ సంఘటన కర్ణాటక కొడగు జిల్లాలో జరిగింది.

Mom's memory is in mobile please find out : Daughter wrote letter to DC
కలెక్టర్​కు చిన్నారి లేఖ
author img

By

Published : May 24, 2021, 9:27 PM IST

Updated : May 24, 2021, 10:45 PM IST

"కరోనాతో మే 16న అమ్మ చనిపోయింది. తన వద్ద ఉన్న ఫోన్​ను ఎవరో ఎత్తుకెళ్లారు. మా అమ్మ జ్ఞాపకాలు అందులో ఉన్నాయి. దానిని ఎవరైనా తీసుకున్నా.. దొరికినా.. దయచేసి ఈ అనాథకు ఇవ్వండి."

ఓ చిన్నారి తన తల్లి జ్ఞాపకాల కోసం పరితపిస్తూ.. జిల్లా పాలనాధికారి, పోలీసులు, ఎమ్మెల్యేకు రాసిన లేఖలోని ఆవేదన. కర్ణాటక కొడగు జిల్లాలో జరిగింది ఈ సంఘటన. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

దయచేసి తెచ్చివ్వండి..

గుమ్మనకొల్లికి చెందిన నవీన్ కుమార్​ అనే వ్యక్తి కూతురు హృతీక్ష ఈ లేఖ రాసింది. "15 రోజుల క్రితం.. అమ్మా నాన్న, నేను కరోనా బారిన పడ్డాం. దీంతో అమ్మ మడికేరి ఆస్పత్రిలో చేరింది. నాన్న, నేను ఇంట్లోనే పొరుగువారి సహకారంతో క్వారంటైన్​లో ఉన్నాం. మే 16న అమ్మ చనిపోయింది. తన వద్ద ఉన్న ఫోన్​ను ఎవరో ఎత్తుకెళ్లారు. మా అమ్మ జ్ఞాపకాలు అందులో ఉన్నాయి. దానిని ఎవరైనా తీసుకున్నా.. దొరికినా.. దయచేసి ఈ అనాథకు ఇవ్వండి." అని లేఖలో విజ్ఞప్తి చేసింది చిన్నారి.

Mom's memory is in mobile please find out : Daughter wrote letter to DC
లేఖతో చిన్నారి

ఈ లేఖపై జిల్లా కలెక్టర్ స్పందించారు. వీలైనంత త్వరగా ఆ ఫోన్​ను గుర్తించి, అప్పగించేందుకు ప్రయత్నిస్తానని చిన్నారికి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: కరోనాతో గర్భిణీ వైద్యురాలు మృతి

"కరోనాతో మే 16న అమ్మ చనిపోయింది. తన వద్ద ఉన్న ఫోన్​ను ఎవరో ఎత్తుకెళ్లారు. మా అమ్మ జ్ఞాపకాలు అందులో ఉన్నాయి. దానిని ఎవరైనా తీసుకున్నా.. దొరికినా.. దయచేసి ఈ అనాథకు ఇవ్వండి."

ఓ చిన్నారి తన తల్లి జ్ఞాపకాల కోసం పరితపిస్తూ.. జిల్లా పాలనాధికారి, పోలీసులు, ఎమ్మెల్యేకు రాసిన లేఖలోని ఆవేదన. కర్ణాటక కొడగు జిల్లాలో జరిగింది ఈ సంఘటన. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

దయచేసి తెచ్చివ్వండి..

గుమ్మనకొల్లికి చెందిన నవీన్ కుమార్​ అనే వ్యక్తి కూతురు హృతీక్ష ఈ లేఖ రాసింది. "15 రోజుల క్రితం.. అమ్మా నాన్న, నేను కరోనా బారిన పడ్డాం. దీంతో అమ్మ మడికేరి ఆస్పత్రిలో చేరింది. నాన్న, నేను ఇంట్లోనే పొరుగువారి సహకారంతో క్వారంటైన్​లో ఉన్నాం. మే 16న అమ్మ చనిపోయింది. తన వద్ద ఉన్న ఫోన్​ను ఎవరో ఎత్తుకెళ్లారు. మా అమ్మ జ్ఞాపకాలు అందులో ఉన్నాయి. దానిని ఎవరైనా తీసుకున్నా.. దొరికినా.. దయచేసి ఈ అనాథకు ఇవ్వండి." అని లేఖలో విజ్ఞప్తి చేసింది చిన్నారి.

Mom's memory is in mobile please find out : Daughter wrote letter to DC
లేఖతో చిన్నారి

ఈ లేఖపై జిల్లా కలెక్టర్ స్పందించారు. వీలైనంత త్వరగా ఆ ఫోన్​ను గుర్తించి, అప్పగించేందుకు ప్రయత్నిస్తానని చిన్నారికి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: కరోనాతో గర్భిణీ వైద్యురాలు మృతి

Last Updated : May 24, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.