ETV Bharat / bharat

అమెజాన్​ గిడ్డంగులపై ఎంఎన్​ఎస్​ కార్యకర్తల దాడి - యాప్​లో మరాఠీ చేర్చాలని దాడి

ముంబయి, పుణెల్లోని అమెజాన్​ గోదాములపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్​ఎస్​) కార్యకర్తలు దాడికి దిగారు. అమెజాన్​ అప్లికేషన్​లో మరాఠీ భాషను వినియోగించకపోవడమే కారణం. నో మరాఠీ నో అమెజాన్​ అని నినదిస్తూ.. గిడ్డంగుల్లోని ఎల్​ఈడీ టీవీ, ల్యాప్​టాప్​లు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.

MNS workers vandalise Amazon warehouse in Mumbai, Pune
అమెజాన్​ గిడ్డంగులపై దాడి
author img

By

Published : Dec 26, 2020, 5:31 AM IST

ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​ గోదాములపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్​ఎస్​) కార్యకర్తలు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ముంబయిలోని అంధేరి శివారు, పుణెలోని కొంద్వాలలో ఈ ఘటనలు జరిగాయి. అమెజాన్​ పోస్టర్లు, వెబ్​సైట్​, యాప్​లోని నావిగేషన్​ వ్యవస్థకు మరాఠీ భాషను వినియోగించకపోవడంపై కొంతకాలంగా ఎంఎన్​ఎస్​ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 'నో మరాఠీ నో అమెజాన్'​ అంటూ నినదిస్తూ ఆ కంపెనీ గిడ్డంగులపై కార్యకర్తలు విరుచుకుపడ్డారు.

అమెజాన్​ గిడ్డంగులపై ఎంఎన్​ఎస్​ కార్యకర్తల దాడి
MNS workers vandalise Amazon warehouse in Mumbai, Pune
సామగ్రి ధ్వంసం

అంధేరిలోని గిడ్డంగిలో ఎల్​ఈడీ టీవీ, ల్యాప్​టాప్​లు తదితరాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. సకినాక పోలీస్​స్టేషన్​లో 8 మందిపై కేసు నమోదైంది. పుణె ఘటనకు సంబంధించి 10 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్​ఐఆర్​ దాఖలైంది. తమ సంస్థ కార్యకలాపాలకు ఎంఎన్​ఎస్​, దాని అనుబంధ కార్మిక సంఘం అవరోధాలు కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ అమెజాన్​ కంపెనీ కొద్దిరోజుల క్రితం దిండోషి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జనవరి 5న కోర్టులో హాజరుకావాలని ఎంఎన్​ఎస్​ అధ్యక్షుడు రాజ్​ఠాకరేకు నోటీసు జారీ అయిన నేపథ్యంలో దాడి ఘటన చోటుచేసుకుంది.

MNS workers vandalise Amazon warehouse in Mumbai, Pune
ఎంఎన్​ఎస్​ కార్యకర్తల దాడి

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో ఏదైనా బాలికల పూజ తర్వాతే..

ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​ గోదాములపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్​ఎస్​) కార్యకర్తలు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ముంబయిలోని అంధేరి శివారు, పుణెలోని కొంద్వాలలో ఈ ఘటనలు జరిగాయి. అమెజాన్​ పోస్టర్లు, వెబ్​సైట్​, యాప్​లోని నావిగేషన్​ వ్యవస్థకు మరాఠీ భాషను వినియోగించకపోవడంపై కొంతకాలంగా ఎంఎన్​ఎస్​ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 'నో మరాఠీ నో అమెజాన్'​ అంటూ నినదిస్తూ ఆ కంపెనీ గిడ్డంగులపై కార్యకర్తలు విరుచుకుపడ్డారు.

అమెజాన్​ గిడ్డంగులపై ఎంఎన్​ఎస్​ కార్యకర్తల దాడి
MNS workers vandalise Amazon warehouse in Mumbai, Pune
సామగ్రి ధ్వంసం

అంధేరిలోని గిడ్డంగిలో ఎల్​ఈడీ టీవీ, ల్యాప్​టాప్​లు తదితరాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. సకినాక పోలీస్​స్టేషన్​లో 8 మందిపై కేసు నమోదైంది. పుణె ఘటనకు సంబంధించి 10 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్​ఐఆర్​ దాఖలైంది. తమ సంస్థ కార్యకలాపాలకు ఎంఎన్​ఎస్​, దాని అనుబంధ కార్మిక సంఘం అవరోధాలు కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ అమెజాన్​ కంపెనీ కొద్దిరోజుల క్రితం దిండోషి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జనవరి 5న కోర్టులో హాజరుకావాలని ఎంఎన్​ఎస్​ అధ్యక్షుడు రాజ్​ఠాకరేకు నోటీసు జారీ అయిన నేపథ్యంలో దాడి ఘటన చోటుచేసుకుంది.

MNS workers vandalise Amazon warehouse in Mumbai, Pune
ఎంఎన్​ఎస్​ కార్యకర్తల దాడి

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో ఏదైనా బాలికల పూజ తర్వాతే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.