ETV Bharat / bharat

అదనపు కట్నం కోసం కట్టేసి చిత్రహింసలు!

author img

By

Published : Aug 3, 2021, 12:16 PM IST

కర్ణాటక విజయపుర జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం తీసుకురావాలని భార్యతో పాటు, ఆమె తల్లిదండ్రులను స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు ఓ వ్యక్తి.

Man beats his wife and her parents by tied them to pole
స్తంభానికి కట్టేసి చిత్రహింసలు
స్తంభానికి కట్టేసి చిత్రహింసలు

అదనపు కట్నం కోసం భార్య, ఆమె కుటుంబ సభ్యుల పట్ల క్రూరంగా ప్రపర్తించాడు ఓ వ్యక్తి. వారిని వీధిలో ఉండే కరెంట్​ స్తంభానికి కట్టేసి కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. కర్ణాటక విజయపురలోని లింగాడహాల్లిలో జరిగిందీ దారుణ ఘటన.

ఏం జరిగిందంటే..

చడచానా తాలూకాలోని ఇంచగేరి గ్రామానికి చెందిన అనిత అనే మహిళ, లింగాడహళ్లి తండాకు చెందిన సంతోష్​లకు రెండేళ్ల క్రితం విహాహం జరిగింది. పెళ్లి అయిన కొన్ని రోజుల తరువాత నుంచి అదనపు వరకట్నం తేవాలని అనితను వేధించ సాగాడు సంతోష్​. అందుకు అనిత నిరాకరించింది. దీంతో సంతోష్​.. అనితను, ఆమె తల్లిదండ్రులను స్తంభానికి కట్టేసి తీవ్రంగా హింసించాడు.

గాయపడిన అనితను ఆమె తల్లిదండ్రులను జిల్లా ఆసుపత్రిలో చేర్పిచారు స్థానికులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: టవర్​ ఎక్కి 135 రోజులుగా నిరసన- దిగొచ్చిన సర్కార్​

స్తంభానికి కట్టేసి చిత్రహింసలు

అదనపు కట్నం కోసం భార్య, ఆమె కుటుంబ సభ్యుల పట్ల క్రూరంగా ప్రపర్తించాడు ఓ వ్యక్తి. వారిని వీధిలో ఉండే కరెంట్​ స్తంభానికి కట్టేసి కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. కర్ణాటక విజయపురలోని లింగాడహాల్లిలో జరిగిందీ దారుణ ఘటన.

ఏం జరిగిందంటే..

చడచానా తాలూకాలోని ఇంచగేరి గ్రామానికి చెందిన అనిత అనే మహిళ, లింగాడహళ్లి తండాకు చెందిన సంతోష్​లకు రెండేళ్ల క్రితం విహాహం జరిగింది. పెళ్లి అయిన కొన్ని రోజుల తరువాత నుంచి అదనపు వరకట్నం తేవాలని అనితను వేధించ సాగాడు సంతోష్​. అందుకు అనిత నిరాకరించింది. దీంతో సంతోష్​.. అనితను, ఆమె తల్లిదండ్రులను స్తంభానికి కట్టేసి తీవ్రంగా హింసించాడు.

గాయపడిన అనితను ఆమె తల్లిదండ్రులను జిల్లా ఆసుపత్రిలో చేర్పిచారు స్థానికులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: టవర్​ ఎక్కి 135 రోజులుగా నిరసన- దిగొచ్చిన సర్కార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.