ETV Bharat / bharat

పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి- ఆరుగురు మృతి

మహారాష్ట్రలో పుట్టిన రోజు వేడుక తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ డ్యామ్​ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సంబరాల్లో ప్రమాదవశాత్తూ నీటిలో పడి నలుగురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

author img

By

Published : Apr 17, 2021, 6:21 PM IST

Birthday bash turns tragic
పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి

మహారాష్ట్రలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నాసిక్​ జిల్లాలోని ఇగత్​పురిలో జరిగిన ఈ వేడుకలో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు నీట మునిగి మృతిచెందారు. శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

వాదివర్హే గ్రామానికి చెందిన సోనీగేమ్​(12) పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు.. తొమ్మిది మంది మిత్రులు(దాదాపు అందరూ మైనర్లే) వాల్దేవీ ఆనకట్ట వద్దకు వెళ్లారు. అందరూ కలిసి డ్యామ్​పై నిల్చుని ఫొటో తీసుకునేందుకు యత్నించగా.. వారిలో కొందరు నీటిలో పడిపోయారు. నీట మునిగిన వారిలో సోనీగేమ్ మృతదేహాన్ని వెంటనే​ వెలికి తీయగా.. శనివారం ఉదయం నాటికి మిగిలిన ఐదుగురి శవాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం వాటిని నాసిక్​ జిల్లా సివిల్​ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

ఇదీ చదవండి: 'ఆక్సిజన్'​ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి

మహారాష్ట్రలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నాసిక్​ జిల్లాలోని ఇగత్​పురిలో జరిగిన ఈ వేడుకలో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు నీట మునిగి మృతిచెందారు. శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

వాదివర్హే గ్రామానికి చెందిన సోనీగేమ్​(12) పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు.. తొమ్మిది మంది మిత్రులు(దాదాపు అందరూ మైనర్లే) వాల్దేవీ ఆనకట్ట వద్దకు వెళ్లారు. అందరూ కలిసి డ్యామ్​పై నిల్చుని ఫొటో తీసుకునేందుకు యత్నించగా.. వారిలో కొందరు నీటిలో పడిపోయారు. నీట మునిగిన వారిలో సోనీగేమ్ మృతదేహాన్ని వెంటనే​ వెలికి తీయగా.. శనివారం ఉదయం నాటికి మిగిలిన ఐదుగురి శవాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం వాటిని నాసిక్​ జిల్లా సివిల్​ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

ఇదీ చదవండి: 'ఆక్సిజన్'​ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.