ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం

Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు.. లష్కరే తోయిబాకు చెందిన ముష్కరులను ముట్టబెట్టాయి. అనంత్​నాగ్, కుల్గాం ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగాయి. మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడిని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది భారత ప్రభుత్వం.

author img

By

Published : Apr 9, 2022, 1:41 PM IST

kashmir encounter
జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు

Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లోని కుల్గాం, అనంతనాగ్​ జిల్లాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య శనివారం కాల్పులు జరిగాయి. అనంతనాగ్​ జిల్లా సర్​హమా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టారు అధికారులు. ముష్కరుడు లష్కరే తోయిబాకు కమాండర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిషార్​ దార్​గా గుర్తించారు. మరోవైపు కుల్గాం జిల్లాలో జరిగిన కాల్పుల్లో మరో ఉగ్రవాది మరణించాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాల సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

అతను కూడా ఉగ్రవాదే: ముంబయి పేలుళ్ల సూత్రదారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్​ సయీద్ కుమారుడి హఫీజ్​ తల్హా సయీద్​ను ఉగ్రవాదిగా ప్రకటించింది ప్రభుత్వం. లష్కరే తోయిబాకు నిధులు సమకూర్చడం, దాడులకు ప్రణాళికలు వేయడం వంటి పలు ఉగ్రవాద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) 1967 ప్రకారం సయీద్​ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఇప్పటివరకు భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో తల్పా సయీద్ 32వ వ్యక్తి.

నవంబర్ 26, 2008లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నాడు. గతంలో సయీద్​ను ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. ప్రస్తుతం ఉగ్రవాద ఆరోపణలపై పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు హఫీజ్ సయీద్. అతడిని కస్టడీకి ఇవ్వాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ పాకిస్థాన్ అందుకు నిరాకరించింది. ముంబయి 26/11 దాడులతో పాటు, అనేక ఘోరమైన దాడులకు లష్కరే తోయిబా పాల్పడింది. ఈ ఉగ్రవాద సంస్థ వల్ల ఎక్కువగా జమ్ముకశ్మీర్‌లో అనేక మంది పౌరులు, భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: ఆశారాం బాపు ఆశ్రమం వద్ద బాలిక మృతదేహం.. కారులోనే కుళ్లిపోయి..

Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లోని కుల్గాం, అనంతనాగ్​ జిల్లాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య శనివారం కాల్పులు జరిగాయి. అనంతనాగ్​ జిల్లా సర్​హమా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టారు అధికారులు. ముష్కరుడు లష్కరే తోయిబాకు కమాండర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిషార్​ దార్​గా గుర్తించారు. మరోవైపు కుల్గాం జిల్లాలో జరిగిన కాల్పుల్లో మరో ఉగ్రవాది మరణించాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాల సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

అతను కూడా ఉగ్రవాదే: ముంబయి పేలుళ్ల సూత్రదారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్​ సయీద్ కుమారుడి హఫీజ్​ తల్హా సయీద్​ను ఉగ్రవాదిగా ప్రకటించింది ప్రభుత్వం. లష్కరే తోయిబాకు నిధులు సమకూర్చడం, దాడులకు ప్రణాళికలు వేయడం వంటి పలు ఉగ్రవాద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) 1967 ప్రకారం సయీద్​ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఇప్పటివరకు భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో తల్పా సయీద్ 32వ వ్యక్తి.

నవంబర్ 26, 2008లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నాడు. గతంలో సయీద్​ను ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. ప్రస్తుతం ఉగ్రవాద ఆరోపణలపై పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు హఫీజ్ సయీద్. అతడిని కస్టడీకి ఇవ్వాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ పాకిస్థాన్ అందుకు నిరాకరించింది. ముంబయి 26/11 దాడులతో పాటు, అనేక ఘోరమైన దాడులకు లష్కరే తోయిబా పాల్పడింది. ఈ ఉగ్రవాద సంస్థ వల్ల ఎక్కువగా జమ్ముకశ్మీర్‌లో అనేక మంది పౌరులు, భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: ఆశారాం బాపు ఆశ్రమం వద్ద బాలిక మృతదేహం.. కారులోనే కుళ్లిపోయి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.