ETV Bharat / bharat

అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..

author img

By

Published : Dec 25, 2020, 8:15 PM IST

శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో.. కాలానికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు ప్రజలు. అయితే.. కర్ణాటకలోని ఓ కుటుంబం మాత్రం మోటారు వాహనాలను వినియోగించకుండా 20 ఏళ్లుగా సైకిల్​నే వినియోగిస్తోంది. సాధారణ జీవనాన్ని ఆస్వాదిస్తూ.. తమ ప్రాంత ప్రజలకు ప్రకృతిపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.

Eco-lover quits teaching profession for environment: Awareness with Bicycle
అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..
అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..

'చక్రం' ఆవిష్కరణ తర్వాత మానవ జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. జనసమూహం అందుకు తగినట్లుగానే తమ జీవితాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మోటారు వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా పర్యావరణం దెబ్బతినడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రకృతిపై మమకారం పెంచుకున్న ఓ అధ్యాపకుడు.. పర్యావరణ హితం కోసం తనవంతుగా కృషి చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే మోటారు వాహనాల జోలికి పోకుండా.. 20 ఏళ్లుగా సైకిల్​నే వాడుతున్నారు. ఆయనొక్కరే కాదండోయ్​? కుటుంబం మొత్తం సైకిల్​నే వినియోగిస్తోంది.

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని తరళబాలు నగరానికి చెందిన డాక్టర్​ హెచ్​.కె.ఎస్​ స్వామి. సైకిల్​ వినియోగాన్ని మరింత పెంచి.. 'ఇంధన రహిత భారత్​' గురించి ఎన్నో కలలు కంటున్నారు స్వామి.

Eco-lover quits teaching profession for environment: Awareness with Bicycle
అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..

ఇద్దరు కూతుర్లకూ భాగస్వామ్యం

ఓ ప్రైవేట్​ వైద్య కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్న స్వామి.. తన వృత్తికి వీడ్కోలు పలికి ప్రకృతిపై అవగాహన కల్పించడంలో నిమగ్నమయ్యారు. ఆయన ఇద్దరు కుమార్తెలు.. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. వారు ఎక్కడికెళ్లినా సైకిల్​నే ఉపయోగిస్తారు. తమ స్నేహితులకు, ఇతరులకు పర్యావరణం గొప్పతనాన్ని గురించి తెలిపేందుకు ఇలా సైకిల్​పై తిరుగుతూ.. ఆ అమ్మాయిలు తమవంతు కృషి చేస్తున్నారు.

ఇలా ప్రకృతిపై ప్రేమతో.. గాంధీ సూత్రాన్ని అనుసరిస్తూ 30ఏళ్లుగా స్వామి కుటుంబం ఖాదీ వస్త్రాలనే ఉపయోగిస్తోంది. పర్యావరణ హితం కోసం చేతితో రాసే బిల్​బోర్డ్​లనూ తయారు చేశారు స్వామి.

Eco-lover quits teaching profession for environment: Awareness with Bicycle
అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..

కాగితాలపై సందేశాలతో..

పర్యావరణంతో పాటు ఇటీవల ప్రజల్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు తనతో పాటు తన కుమార్తెలిద్దరిని భాగస్వామ్యం చేశారు స్వామి. వీరు ఇతర ప్రాంతాలకు సైకిల్​పై వెళ్లి ప్రకృతి గురించి ప్రజలకు వివరిస్తారు. పర్యావరణ ప్రాముఖ్యతను చాటేందుకు కాగితాలపై చక్కని సందేశాలు రాసి అతికిస్తారు.

ఇలా స్వామి కృషిని అనేక మంది మెచ్చుకోగా.. మరికొందరు వారి ఖాళీ సమయాల్లో ఆయనకు సాయమందిస్తున్నారు.

ఇదీ చదవండి: పాతికేళ్లుగా పాములతో సావాసం చేస్తోన్న 'బినీష్​'

అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..

'చక్రం' ఆవిష్కరణ తర్వాత మానవ జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. జనసమూహం అందుకు తగినట్లుగానే తమ జీవితాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మోటారు వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా పర్యావరణం దెబ్బతినడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రకృతిపై మమకారం పెంచుకున్న ఓ అధ్యాపకుడు.. పర్యావరణ హితం కోసం తనవంతుగా కృషి చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే మోటారు వాహనాల జోలికి పోకుండా.. 20 ఏళ్లుగా సైకిల్​నే వాడుతున్నారు. ఆయనొక్కరే కాదండోయ్​? కుటుంబం మొత్తం సైకిల్​నే వినియోగిస్తోంది.

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని తరళబాలు నగరానికి చెందిన డాక్టర్​ హెచ్​.కె.ఎస్​ స్వామి. సైకిల్​ వినియోగాన్ని మరింత పెంచి.. 'ఇంధన రహిత భారత్​' గురించి ఎన్నో కలలు కంటున్నారు స్వామి.

Eco-lover quits teaching profession for environment: Awareness with Bicycle
అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..

ఇద్దరు కూతుర్లకూ భాగస్వామ్యం

ఓ ప్రైవేట్​ వైద్య కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్న స్వామి.. తన వృత్తికి వీడ్కోలు పలికి ప్రకృతిపై అవగాహన కల్పించడంలో నిమగ్నమయ్యారు. ఆయన ఇద్దరు కుమార్తెలు.. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. వారు ఎక్కడికెళ్లినా సైకిల్​నే ఉపయోగిస్తారు. తమ స్నేహితులకు, ఇతరులకు పర్యావరణం గొప్పతనాన్ని గురించి తెలిపేందుకు ఇలా సైకిల్​పై తిరుగుతూ.. ఆ అమ్మాయిలు తమవంతు కృషి చేస్తున్నారు.

ఇలా ప్రకృతిపై ప్రేమతో.. గాంధీ సూత్రాన్ని అనుసరిస్తూ 30ఏళ్లుగా స్వామి కుటుంబం ఖాదీ వస్త్రాలనే ఉపయోగిస్తోంది. పర్యావరణ హితం కోసం చేతితో రాసే బిల్​బోర్డ్​లనూ తయారు చేశారు స్వామి.

Eco-lover quits teaching profession for environment: Awareness with Bicycle
అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..

కాగితాలపై సందేశాలతో..

పర్యావరణంతో పాటు ఇటీవల ప్రజల్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు తనతో పాటు తన కుమార్తెలిద్దరిని భాగస్వామ్యం చేశారు స్వామి. వీరు ఇతర ప్రాంతాలకు సైకిల్​పై వెళ్లి ప్రకృతి గురించి ప్రజలకు వివరిస్తారు. పర్యావరణ ప్రాముఖ్యతను చాటేందుకు కాగితాలపై చక్కని సందేశాలు రాసి అతికిస్తారు.

ఇలా స్వామి కృషిని అనేక మంది మెచ్చుకోగా.. మరికొందరు వారి ఖాళీ సమయాల్లో ఆయనకు సాయమందిస్తున్నారు.

ఇదీ చదవండి: పాతికేళ్లుగా పాములతో సావాసం చేస్తోన్న 'బినీష్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.