మద్యం మత్తులో పేగుబంధాన్ని మరిచి ప్రవర్తించాడు ఓ వ్యక్తి. డబ్బుల కోసం గొడవపడి కన్నతల్లినే కడతేర్చాడు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో జరిగింది.
![son killed mother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-ctd-08-murderka100531_09072021170048_0907f_1625830248_1061_0907newsroom_1625844687_272.jpg)
ఇనుప రాడ్డుతో..
మోలకల్మూరులో నివసించే రత్నమ్మ(45) కుమారుడు లోకేశ(22).. ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం.. డబ్బులు కావాలని తన తల్లిని వేధించాడు. వాగ్వాదానికీ దిగాడు. అయితే డబ్బులిచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన లోకేశ.. తన తల్లిని ఇనుపరాడ్డుతో గట్టిగా మోదాడు. తీవ్రంగా గాయపడ్డ రత్నమ్మ అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
![son killed mother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-ctd-08-murderka100531_09072021170048_0907f_1625830248_67_0907newsroom_1625844687_503.jpg)
![son killed mother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-ctd-08-murderka100531_09072021170048_0907f_1625830248_460_0907newsroom_1625844687_1032.jpg)
స్థానికులు ఈ విషయంపై పోలీసులకు తెలియజేయగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు లోకేశను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ జి.రాధిక తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ఇంటికి అన్నీ తానై.. 13 ఏళ్లకే రైతుగా..
ఇదీ చూడండి: అతి చిన్న వయసులో రికార్డు 'పంచ్'లు