ఝార్ఖండ్ పాలము జిల్లాలో చైన్పుర్ పోలీస్స్టేషన్ ఆవరణలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.
స్టేషన్లో ఉండే చెత్తను శుభ్రపరిచి కాల్చుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలపై కచ్చితమైన సమాచారం లేదని తెలిపిన సిబ్బంది... చెత్తలో ఉండే పెట్రోల్ బాటిల్ వేడికి పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు.


గాయపడిన వారిలో నలుగురు వాచ్మెన్లతో పాటు ఒక కానిస్టేబుల్ ఉన్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉండే మేదినీరాయ్ మెడికల్ కాలేజ్కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో వాచ్మెన్ నందు మాంఝీ పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై సీనియర్ అధికారులతో కూడిన ఓ బృందం దర్యాప్తు చేస్తుందని పాలము ఎస్పీ చందన్ కుమార్ సిన్హా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చిన్నారిని కిడ్నాప్ చేసి.. నోట్లో తుపాకీ పెట్టి..!