ETV Bharat / bharat

భాజపా కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాది అరెస్ట్​

author img

By

Published : Feb 13, 2021, 11:59 AM IST

గతేడాది అక్టోబర్​లో ముగ్గురు భాజపా కార్యకర్తలను, ఓ పోలీస్ అధికారిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముష్కరుడిని.. జహూర్ అహ్మద్​ రాథర్​ అలియాస్​ ఖలీద్​గా గుర్తించారు.

J-K Police arrests TRF terrorist who killed 3 BJP workers, cop
ముగ్గురు భాజపా కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాది అరెస్ట్​

గతేడాది అక్టోబర్​లో ముగ్గురు భాజపా కార్యకర్తలను, ఓ పోలీస్ అధికారిని కాల్చి చంపిన టీఆర్​ఎఫ్ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్​లోని సాంబా సెక్టార్ ప్రాంతంలో శనివారం అరెస్ట్​ చేశారు. ఈ ముష్కరుడు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ.. ద రెసిస్టెన్స్​ ఫోర్స్​కు చెందిన జహూర్ అహ్మద్​ రాథర్ అలియాస్​ ఖలీద్​​గా గుర్తించారు.

2020 అక్టోబర్ 29న కుల్గాం​ జిల్లాలోని వెస్సు ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు భాజపా కార్యకర్తలు మరణించారు. ఫర్రాలో ఓ పోలీస్ ఆఫీసర్​ను కాల్చి చంపారు.

గతేడాది అక్టోబర్​లో ముగ్గురు భాజపా కార్యకర్తలను, ఓ పోలీస్ అధికారిని కాల్చి చంపిన టీఆర్​ఎఫ్ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్​లోని సాంబా సెక్టార్ ప్రాంతంలో శనివారం అరెస్ట్​ చేశారు. ఈ ముష్కరుడు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ.. ద రెసిస్టెన్స్​ ఫోర్స్​కు చెందిన జహూర్ అహ్మద్​ రాథర్ అలియాస్​ ఖలీద్​​గా గుర్తించారు.

2020 అక్టోబర్ 29న కుల్గాం​ జిల్లాలోని వెస్సు ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు భాజపా కార్యకర్తలు మరణించారు. ఫర్రాలో ఓ పోలీస్ ఆఫీసర్​ను కాల్చి చంపారు.

ఇదీ చదవండి: ఉగ్రదాడిలో ముగ్గురు భాజపా కార్యకర్తలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.