మాఫియా నేత ఇక్బాల్ మిర్చికి చెందిన ముంబయిలోని రూ.500 కోట్ల విలువైన మూడు ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. స్మగ్లింగ్, మాదకద్రవ్యాల సరఫరా, విదేశీమారక ద్రవ్య అక్రమాల నిరోధక చట్టాల కింద ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది ఈడీ.
ఇక్బాల్కు సంబంధించిన వర్లి ప్రాంతంలోని మూడు భవనాల(స్థిరాస్తులు)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు. దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంగా భావించే ఇక్బాల్ మిర్చి 2013లో లండన్లో చనిపోయాడు.
ఇదీ చదవండి: దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలంపాట