ETV Bharat / bharat

అత్యాచారం జరిగిన 17ఏళ్లకు ఫిర్యాదు - madhya pradesh rape cases

అత్యాచారం జరిగిన 17 ఏళ్లకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి వివరాలు తెలియకపోవడమే ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొంది. 2019లో ఫేస్​బుక్​ ద్వారా బాధితురాలు అతని పేరు, వివరాలు తెలుసుకుందని పోలీసులు వెల్లడించారు.

rape
అత్యాచారం జరిగిన 17 ఏళ్లకు ఫిర్యాదు
author img

By

Published : Mar 20, 2021, 7:54 AM IST

మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో నివసిస్తున్న ఓ మహిళ అత్యాచారం జరిగిన 17 ఏళ్లకు పోలీసులను ఆశ్రయించింది. 2004లో గుర్తుతెలియని వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

"నీముచ్​కు చెందిన బాధితురాలిపై ఇందోర్​లో 2004లో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెకు ఇందోర్​లో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. బాధితురాలి ఆర్థిక స్థితి దృష్ట్యా ఆమె అందుకు ఒప్పుకుంది. అప్పుడు ఆమె వయసు 23-24 మధ్య ఉంటాయి. నిందితుడి అసలు పేరు తెలియని కారణంగా ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదు. 2019లో ఫేస్​బుక్​ ద్వారా బాధితురాలు అతని వివరాలను ఆమె కనుగొంది. నిందితుడు రత్లాం జిల్లా జవోరాకు చెందినవాడని తెలిసింది."

-పోలీసులు

ఇదీ చదవండి : అత్యాచారం జరిగిన 27 ఏళ్లకు కేసు పెట్టిన బాధితురాలు

మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో నివసిస్తున్న ఓ మహిళ అత్యాచారం జరిగిన 17 ఏళ్లకు పోలీసులను ఆశ్రయించింది. 2004లో గుర్తుతెలియని వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

"నీముచ్​కు చెందిన బాధితురాలిపై ఇందోర్​లో 2004లో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెకు ఇందోర్​లో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. బాధితురాలి ఆర్థిక స్థితి దృష్ట్యా ఆమె అందుకు ఒప్పుకుంది. అప్పుడు ఆమె వయసు 23-24 మధ్య ఉంటాయి. నిందితుడి అసలు పేరు తెలియని కారణంగా ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదు. 2019లో ఫేస్​బుక్​ ద్వారా బాధితురాలు అతని వివరాలను ఆమె కనుగొంది. నిందితుడు రత్లాం జిల్లా జవోరాకు చెందినవాడని తెలిసింది."

-పోలీసులు

ఇదీ చదవండి : అత్యాచారం జరిగిన 27 ఏళ్లకు కేసు పెట్టిన బాధితురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.