ఉగ్రవాదుల పని పట్టేందుకు భారత సైన్యాధికారి ఒకరు సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 'మైక్రోకాప్టర్'ను తయారు చేశారు. భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించే సమయంలో భవనాలు, గదుల్లో నక్కి ఉండే ముష్కరులను పసిగట్టేందుకు లెఫ్టినెంట్ కర్నల్ జీవైకే కర్నల్ దీనిని అభివృద్ధి చేశారు.
మైక్రోకాప్టర్ పనితీరును పారా మిలిటరీ ప్రత్యేక దళాలు జమ్ముకశ్మీర్లోని బెటాలియన్లో విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ మైక్రోడ్రోన్కు మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
సరిహహద్దులో నిఘా కోసం స్విచ్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి 4,500 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 2గంటలు పాటు ఎగురగలవు.