ETV Bharat / bharat

చైనాకు చెక్​ పెట్టేలా..  భారత్​, అమెరికా యుద్ధ విన్యాసాలు!

author img

By

Published : Jun 23, 2021, 7:33 PM IST

హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరగనున్న యుద్ధవిన్యాసాలను.. భారత్​, అమెరికాలు బుధవారం ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలకు చెందిన యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే హిందూ మహా సముద్రంలో మోహరించాయి. ఈ ప్రాంతంలో చైనా ఆగడాలకు చెక్​పెట్టేందుకు ఈ విన్యాసాలను చేపట్టినట్లు తెలుస్తోంది.

wargame in Indian Ocean
భారత్​, అమెరికా యుద్ధ విన్యాసాలు

హిందూ మహాసముద్రంలో.. భారత్​, అమెరికా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను బుధవారం ప్రారంభించాయి. రెండు రోజులపాటు ఈ విన్యాసాలు ప్రదర్శించనున్నాయి ఇరు దేశాలు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు చెక్​ పెట్టే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

అమెరికా తమ నావికాదళమైన యూఎస్​ఎస్​ రోనాల్డ్​ రీగన్​కు చెందిన​ యుద్ధనౌకలు, ఎఫ్​-18, ఈ-2సీ యుద్ధ విమానాలను ఈ విన్యాసాల కోసం మోహరించింది.

భారత్​ తమ జాగ్వార్​, సుఖోయ్-30ఎం​కేఐ యుద్ధ విమానం, గాలిలోనే ఇంధనాన్ని రీఫిల్​ చేసే ఐఎల్​-78 యుద్ధవిమానం, ఏడబ్ల్యూఏసీసీ యద్ధవిమానాలను, ఐఎన్​ఎస్​ కోచి, ఐఎన్​ఎస్​ టెగ్​ యద్ధనౌకలను మోహరించింది. ​వీటితో పాటు.. పీ8ఐ సముద్రతీర నిఘా వ్యవస్థను, మిగ్​29కే యుద్ధవిమానాలను కూడా భారత్​ ఈ విన్యాసాల కోసం సిద్ధం చేసింది.

wargame in Indian Ocean
విన్యాసాల్లో యుద్ధనౌక
wargame in Indian Ocean
యూఎస్​ఎస్​ రోనాల్డ్​ రీగన్​
wargame in Indian Ocean
విన్యాసాల్లో యుద్ధనౌక
wargame in Indian Ocean
విన్యాసాల్లో పాల్గొనున్న యుద్ధనౌక
wargame in Indian Ocean
విన్యాసాలకు సిద్ధంగా ఉన్న భారత యుద్ధ విమానాలు

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం సహా సముద్రతీర ప్రాంతాల్లో సమగ్ర సమన్వయం కోసం ఈ రెండురోజుల విన్యాసాలను చేపడుతున్నట్లు భారత నౌకాదళ ప్రతినిధి కమాండర్​ వివేక్​ మాద్వాల్​ తెలిపారు. కేరళ తిరువనంతపురానికి దక్షిణాన ఈ విన్యాసాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆ ఉగ్రవాది ఇంటి వద్ద పేలుడు- ముగ్గురు మృతి

ఇదీ చూడండి: 'ఏకపక్ష చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించం'

హిందూ మహాసముద్రంలో.. భారత్​, అమెరికా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను బుధవారం ప్రారంభించాయి. రెండు రోజులపాటు ఈ విన్యాసాలు ప్రదర్శించనున్నాయి ఇరు దేశాలు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు చెక్​ పెట్టే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

అమెరికా తమ నావికాదళమైన యూఎస్​ఎస్​ రోనాల్డ్​ రీగన్​కు చెందిన​ యుద్ధనౌకలు, ఎఫ్​-18, ఈ-2సీ యుద్ధ విమానాలను ఈ విన్యాసాల కోసం మోహరించింది.

భారత్​ తమ జాగ్వార్​, సుఖోయ్-30ఎం​కేఐ యుద్ధ విమానం, గాలిలోనే ఇంధనాన్ని రీఫిల్​ చేసే ఐఎల్​-78 యుద్ధవిమానం, ఏడబ్ల్యూఏసీసీ యద్ధవిమానాలను, ఐఎన్​ఎస్​ కోచి, ఐఎన్​ఎస్​ టెగ్​ యద్ధనౌకలను మోహరించింది. ​వీటితో పాటు.. పీ8ఐ సముద్రతీర నిఘా వ్యవస్థను, మిగ్​29కే యుద్ధవిమానాలను కూడా భారత్​ ఈ విన్యాసాల కోసం సిద్ధం చేసింది.

wargame in Indian Ocean
విన్యాసాల్లో యుద్ధనౌక
wargame in Indian Ocean
యూఎస్​ఎస్​ రోనాల్డ్​ రీగన్​
wargame in Indian Ocean
విన్యాసాల్లో యుద్ధనౌక
wargame in Indian Ocean
విన్యాసాల్లో పాల్గొనున్న యుద్ధనౌక
wargame in Indian Ocean
విన్యాసాలకు సిద్ధంగా ఉన్న భారత యుద్ధ విమానాలు

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం సహా సముద్రతీర ప్రాంతాల్లో సమగ్ర సమన్వయం కోసం ఈ రెండురోజుల విన్యాసాలను చేపడుతున్నట్లు భారత నౌకాదళ ప్రతినిధి కమాండర్​ వివేక్​ మాద్వాల్​ తెలిపారు. కేరళ తిరువనంతపురానికి దక్షిణాన ఈ విన్యాసాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆ ఉగ్రవాది ఇంటి వద్ద పేలుడు- ముగ్గురు మృతి

ఇదీ చూడండి: 'ఏకపక్ష చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.