ETV Bharat / bharat

'రోజుకు కోటి టీకాలు వేస్తేనే కరోనాపై విజయం!'

author img

By

Published : Jul 14, 2021, 7:31 PM IST

వయోజనులందరికీ డిసెంబర్​ నాటికి టీకా వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియలో ప్రస్తుతం అనుసరిస్తున్న వేగమే ఇకపైనా కొనసాగితే.. ఆ లక్ష్యం చేరుకోవడం అసాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కోటి చొప్పున టీకా డోసులను పంపిణీ చేసినప్పుడే.. ఇది సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. మరి రోజుకు కోటి డోసులు పంపిణీ చేయడానికి కేంద్రానికి ఉన్న అడ్డంకులు ఏంటి? వాటిని అధిగమించే మార్గాలేంటి?

vaccination in india
దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ

కరోనా రెండో దశ కోరల్లో చిక్కుకుని విలవిలాడిన భారత్​ ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతోంది. మరోవైపు.. కొత్త వేరియంట్ల విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే మూడో దశ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆ భయానక విలయంలో భారత్​ చిక్కుకోకూడదంటే అందరికీ సాధ్యమైనంత త్వరగా టీకా అందించాల్సిన అవసరం ఉంది. అయితే.. 2021 డిసెంబర్ నాటికి దేశంలో వయోజనుల(18 ఏళ్లు దాటిన వారు) అందరికీ టీకా అందిస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పింది. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కేంద్రం విజయం సాధించేనా?

టీకా వేగం ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే.. డిసెంబర్​ నాటికి వయోజనులందరికీ టీకా పంపిణీ చేయాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు టీకాలతో పాటు మరిన్ని టీకాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో ప్రజల్లో టీకా పట్ల ఉన్న అనుమానాలను తొలగించాలని సూచిస్తున్నారు.

"వయోజనులందరికీ డిసెంబర్ నాటికి టీకా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రోజుకు కోటి చొప్పున టీకా డోసులు పంపిణీ చేయాలి. మరిన్ని టీకాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలు.. టీకా తీసుకునేలా ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అయినప్పటికీ.. చాలా మందిలో ఇంకా వ్యాక్సిన్లపై అపోహలు ఉన్నాయి. వాటిని కూడా తొలగించి అందరినీ టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది."

-గిరిధర్ జ్ఞాని, అసోసియేషన్​​ ఆఫ్​ హెల్త్​కేర్​ ప్రొవైడర్స్​(ఏహెచ్​సీపీ)- డైరెక్టర్ జనరల్​

జూన్​ 21 నుంచి టీకా పంపిణీ ప్రక్రియలో కేంద్రం మార్పులు తీసుకువచ్చింది. అప్పటి నుంచి దేశంలో రోజుకు సగటున 40 లక్షల టీకా డోసుల పంపిణీ జరుగుతోంది. అయితే.. ఈ టీకా విధానాన్ని తీసుకువచ్చిన మొదటి రోజున గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో 88 లక్షల టీకా డోసులను పంపిణీ చేశారు.

మాట మార్చిన కేంద్రం!

ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్​, కొవిషీల్డ్​, స్పుత్నిక్​ వి టీకాలను పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38.5 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు.. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య పంపిణీ చేసేందుకు 216 కోట్ల డోసులను తాము సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మే నెలలో తెలిపింది. అయితే.. నెలరోజుల తర్వాత.. 135 కోట్ల టీకా డోసులను మాత్రమే ఆగస్టు నుంచి డిసెంబర్​ మధ్య పంపిణీ చేసేందుకు తాము సేకరిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదించింది. ఇది మే నెలలో కేంద్రం చెప్పిన దానికంటే 80 కోట్ల డోసులు తక్కువగా ఉండటం గమనార్హం.

" నిర్దేశిత లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోవాలంటే మరిన్ని అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. టీకా లభ్యత, వాటి ఉత్పత్తి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. సాధ్యమైనంత త్వరగా ఇతర టీకాలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలి. జాన్సన్​ అండ్ జాన్సన్​, జైడస్​ క్యాడిలా టీకాలకు త్వరలోనే భారత్​లో అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తాయి. "

-గిరిధర్​ జ్ఞాని, ఏహెచ్​సీపీ డైరెక్టర్​ జనరల్​

'ఉత్పత్తి పెరగాలి'

అయితే.. ప్రస్తుతం ఉన్న మూడు టీకాలతో పాటు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఇటీవలే అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. 'డిసెంబర్​' లక్ష్యం నెరవేరాలంటే.. 'టీకా ఉత్పత్తి పెంచాల్సి అవసరం ఎంతో ఉందని ఆర్గనైజ్​డ్​ మెడికల్​ అకడమిక్​ గిల్డ్​(ఓఎంఏజీ) అధ్యక్షురాలు సునీలా గార్గ్​ తెలిపారు.

"మనం రోజుకు కోటి మందికి టీకా వేయాలంటే నెలకు 30 కోట్ల టీకా డోసులు కావాలి. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల ఉత్పత్తి సంఖ్యను పెంచాలి."

-సునీలా గార్గ్​, ఓఎంఏజీ అధ్యక్షురాలు

దేశంలో 18 ఏళ్లు దాటిన 90 కోట్ల మందికి టీకా వేయాలంటే.. 180 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని సునీలా గార్గ్ తెలిపారు. ప్రస్తుతం నెలకు సగటున 10-11 కోట్ల టీకా డోసులను మాత్రమే భారత్​లో పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

ఎక్కడెక్కడ? ఎన్నెన్ని?

  • "అవర్ వరల్డ్​ ఇన్​ డేటా" నివేదిక ప్రకారం... 30 కోట్ల మందికి కనీసం ఒక డోసు టీకా అందించి అన్ని దేశాల కంటే ప్రథమ స్థానంలో భారత్​లో ఉంది. అమెరికాలో ఈ సంఖ్య 18 కోట్లు ఉండగా.. బ్రెజిల్​లో 8.6 కోట్లుగా ఉంది.
  • టీకా రెండు డోసులు పంపిణీ చేసిన దేశాల జాబితాలో భారత్​ 12వ స్థానంలో ఉంది. భారత్​లో సగటు పూర్తి వ్యాక్సినేషన్​ రేటు 5.4 శాతం ఉంది. ఇది ప్రపంచ సగటు 12.3శాతం కంటే తక్కువే.
  • 60.1శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ చేసి.. బహ్రెయిన్ ప్రథమ స్థానంలో ఉండగా.. ఇజ్రాయెల్​ 60 శాతం, మంగోలియా 54.8శాతం, అమెరికా 47.7శాతం, జర్మనీ(42.7శాతం), ఇటలీ(38.9శాతం), బ్రెజిల్​(14.6శాతం) దేశాలు భారత్​ కంటే ముందువరుసలో ఉన్నాయి.
  • 7.3 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకోగా.. 23 కోట్ల మంది టీకా మొదటి డోసు తీసుకున్నారు.
  • అమెరికాలో 15.9 కోట్ల మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు.

'60శాతం మందికే'

భారత్​లో ప్రస్తుతం సగటు వ్యాక్సినేషన్​ రేటు 40 లక్షలుగా ఉందని మరో వైద్య నిపుణుడు, ఆసియన్​ సొసైటీ ఫర్​ ఎమర్జెన్సీ మెడిసిన్​ అధ్యక్షుడు డాక్టర్ తమోరిశ్​ కోలే తెలిపారు. ఇదే వేగంతో టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగితే.. డిసెంబర్ నాటికి 60శాతం జనాభాకు మాత్రమే రెండు డోసుల టీకా అందుతుందని చెప్పారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశవ్యాప్తంగా 87 లక్షల టీకా డోసులను పంపిణీ చేయాలని డాక్టర్​ కోలే అభిప్రాయపడ్డారు. అయితే రానున్న నెలల్లో టీకా ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా టీకా పంపిణీ కేంద్రాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు.

"త్వరలో అందుబాటులోకి వచ్చేందుకు ఆరు టీకాలు ఎదురుచూస్తున్నాయి. ఇది వ్యాక్సిన్​ సరఫరా పరంగా మంచి వార్త. అదే సమయంలో వ్యాక్సిన్​పై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అపోహలు ఉన్నాయి. ఇవి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు."

-డాక్టర్​ కోలే, వైద్య నిపుణుడు.

మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున.. రాష్ట్ర స్థాయిలో వైరస్​పై సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని డాక్టర్​ కోలే తెలిపారు. జూన్​ 21న భారత్​లో అత్యధికంగా 88 లక్షల టీకా డోసులు పంపిణీ చేశారన్న ఆయన.. ఆ తర్వాత నుంచి క్రమంగా టీకా పంపిణీ సంఖ్య తగ్గుతూ వచ్చిందని చెప్పారు.

ఇవీ చూడండి:

కరోనా రెండో దశ కోరల్లో చిక్కుకుని విలవిలాడిన భారత్​ ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతోంది. మరోవైపు.. కొత్త వేరియంట్ల విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే మూడో దశ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆ భయానక విలయంలో భారత్​ చిక్కుకోకూడదంటే అందరికీ సాధ్యమైనంత త్వరగా టీకా అందించాల్సిన అవసరం ఉంది. అయితే.. 2021 డిసెంబర్ నాటికి దేశంలో వయోజనుల(18 ఏళ్లు దాటిన వారు) అందరికీ టీకా అందిస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పింది. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కేంద్రం విజయం సాధించేనా?

టీకా వేగం ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే.. డిసెంబర్​ నాటికి వయోజనులందరికీ టీకా పంపిణీ చేయాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు టీకాలతో పాటు మరిన్ని టీకాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో ప్రజల్లో టీకా పట్ల ఉన్న అనుమానాలను తొలగించాలని సూచిస్తున్నారు.

"వయోజనులందరికీ డిసెంబర్ నాటికి టీకా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రోజుకు కోటి చొప్పున టీకా డోసులు పంపిణీ చేయాలి. మరిన్ని టీకాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలు.. టీకా తీసుకునేలా ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అయినప్పటికీ.. చాలా మందిలో ఇంకా వ్యాక్సిన్లపై అపోహలు ఉన్నాయి. వాటిని కూడా తొలగించి అందరినీ టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది."

-గిరిధర్ జ్ఞాని, అసోసియేషన్​​ ఆఫ్​ హెల్త్​కేర్​ ప్రొవైడర్స్​(ఏహెచ్​సీపీ)- డైరెక్టర్ జనరల్​

జూన్​ 21 నుంచి టీకా పంపిణీ ప్రక్రియలో కేంద్రం మార్పులు తీసుకువచ్చింది. అప్పటి నుంచి దేశంలో రోజుకు సగటున 40 లక్షల టీకా డోసుల పంపిణీ జరుగుతోంది. అయితే.. ఈ టీకా విధానాన్ని తీసుకువచ్చిన మొదటి రోజున గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో 88 లక్షల టీకా డోసులను పంపిణీ చేశారు.

మాట మార్చిన కేంద్రం!

ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్​, కొవిషీల్డ్​, స్పుత్నిక్​ వి టీకాలను పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38.5 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు.. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య పంపిణీ చేసేందుకు 216 కోట్ల డోసులను తాము సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మే నెలలో తెలిపింది. అయితే.. నెలరోజుల తర్వాత.. 135 కోట్ల టీకా డోసులను మాత్రమే ఆగస్టు నుంచి డిసెంబర్​ మధ్య పంపిణీ చేసేందుకు తాము సేకరిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదించింది. ఇది మే నెలలో కేంద్రం చెప్పిన దానికంటే 80 కోట్ల డోసులు తక్కువగా ఉండటం గమనార్హం.

" నిర్దేశిత లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోవాలంటే మరిన్ని అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. టీకా లభ్యత, వాటి ఉత్పత్తి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. సాధ్యమైనంత త్వరగా ఇతర టీకాలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలి. జాన్సన్​ అండ్ జాన్సన్​, జైడస్​ క్యాడిలా టీకాలకు త్వరలోనే భారత్​లో అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తాయి. "

-గిరిధర్​ జ్ఞాని, ఏహెచ్​సీపీ డైరెక్టర్​ జనరల్​

'ఉత్పత్తి పెరగాలి'

అయితే.. ప్రస్తుతం ఉన్న మూడు టీకాలతో పాటు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఇటీవలే అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. 'డిసెంబర్​' లక్ష్యం నెరవేరాలంటే.. 'టీకా ఉత్పత్తి పెంచాల్సి అవసరం ఎంతో ఉందని ఆర్గనైజ్​డ్​ మెడికల్​ అకడమిక్​ గిల్డ్​(ఓఎంఏజీ) అధ్యక్షురాలు సునీలా గార్గ్​ తెలిపారు.

"మనం రోజుకు కోటి మందికి టీకా వేయాలంటే నెలకు 30 కోట్ల టీకా డోసులు కావాలి. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల ఉత్పత్తి సంఖ్యను పెంచాలి."

-సునీలా గార్గ్​, ఓఎంఏజీ అధ్యక్షురాలు

దేశంలో 18 ఏళ్లు దాటిన 90 కోట్ల మందికి టీకా వేయాలంటే.. 180 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని సునీలా గార్గ్ తెలిపారు. ప్రస్తుతం నెలకు సగటున 10-11 కోట్ల టీకా డోసులను మాత్రమే భారత్​లో పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

ఎక్కడెక్కడ? ఎన్నెన్ని?

  • "అవర్ వరల్డ్​ ఇన్​ డేటా" నివేదిక ప్రకారం... 30 కోట్ల మందికి కనీసం ఒక డోసు టీకా అందించి అన్ని దేశాల కంటే ప్రథమ స్థానంలో భారత్​లో ఉంది. అమెరికాలో ఈ సంఖ్య 18 కోట్లు ఉండగా.. బ్రెజిల్​లో 8.6 కోట్లుగా ఉంది.
  • టీకా రెండు డోసులు పంపిణీ చేసిన దేశాల జాబితాలో భారత్​ 12వ స్థానంలో ఉంది. భారత్​లో సగటు పూర్తి వ్యాక్సినేషన్​ రేటు 5.4 శాతం ఉంది. ఇది ప్రపంచ సగటు 12.3శాతం కంటే తక్కువే.
  • 60.1శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ చేసి.. బహ్రెయిన్ ప్రథమ స్థానంలో ఉండగా.. ఇజ్రాయెల్​ 60 శాతం, మంగోలియా 54.8శాతం, అమెరికా 47.7శాతం, జర్మనీ(42.7శాతం), ఇటలీ(38.9శాతం), బ్రెజిల్​(14.6శాతం) దేశాలు భారత్​ కంటే ముందువరుసలో ఉన్నాయి.
  • 7.3 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకోగా.. 23 కోట్ల మంది టీకా మొదటి డోసు తీసుకున్నారు.
  • అమెరికాలో 15.9 కోట్ల మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు.

'60శాతం మందికే'

భారత్​లో ప్రస్తుతం సగటు వ్యాక్సినేషన్​ రేటు 40 లక్షలుగా ఉందని మరో వైద్య నిపుణుడు, ఆసియన్​ సొసైటీ ఫర్​ ఎమర్జెన్సీ మెడిసిన్​ అధ్యక్షుడు డాక్టర్ తమోరిశ్​ కోలే తెలిపారు. ఇదే వేగంతో టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగితే.. డిసెంబర్ నాటికి 60శాతం జనాభాకు మాత్రమే రెండు డోసుల టీకా అందుతుందని చెప్పారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశవ్యాప్తంగా 87 లక్షల టీకా డోసులను పంపిణీ చేయాలని డాక్టర్​ కోలే అభిప్రాయపడ్డారు. అయితే రానున్న నెలల్లో టీకా ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా టీకా పంపిణీ కేంద్రాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు.

"త్వరలో అందుబాటులోకి వచ్చేందుకు ఆరు టీకాలు ఎదురుచూస్తున్నాయి. ఇది వ్యాక్సిన్​ సరఫరా పరంగా మంచి వార్త. అదే సమయంలో వ్యాక్సిన్​పై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అపోహలు ఉన్నాయి. ఇవి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు."

-డాక్టర్​ కోలే, వైద్య నిపుణుడు.

మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున.. రాష్ట్ర స్థాయిలో వైరస్​పై సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని డాక్టర్​ కోలే తెలిపారు. జూన్​ 21న భారత్​లో అత్యధికంగా 88 లక్షల టీకా డోసులు పంపిణీ చేశారన్న ఆయన.. ఆ తర్వాత నుంచి క్రమంగా టీకా పంపిణీ సంఖ్య తగ్గుతూ వచ్చిందని చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.