ETV Bharat / bharat

దేశంలో 3 కోట్ల మైలురాయి దాటిన టీకా పంపిణీ

author img

By

Published : Mar 15, 2021, 7:59 PM IST

Updated : Mar 15, 2021, 11:06 PM IST

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సరికొత్త తీరాలకు చేరింది. సోమవారం నాటికి 3.17 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు.. ప్రజలు నిబంధనలు పాటించకపోవటమే కేసుల పెరుగుదలకు కారణమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​.

India crosses the milestone of 3.15 crore #COVID19  vaccinations: Ministry of Health
దేశవ్యాప్తంగా 3 కోట్ల కొవిడ్ టీకాలు

కరోనా మహమ్మారి పోరులో భాగంగా టీకా పంపిణీలో భారత్​ సరికొత్త మైలురాయిని చేరుకుంది. సోమవారం నాటికి మొత్తం 3,17,71,661 వ్యాక్సిన్ డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అందులో 74,08,521 మంది తొలి డోసు, 43,97,613 రెండో డోసు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు(హెచ్​ఎస్​డబ్ల్యూ) ఉన్నారు. వారితో పాటు 74,26,479 మంది తొలి డోసు, 13,23,527 రెండో డోసు వేయించుకున్న ఫ్రంట్​లైన్ వర్కర్స్​(ఎఫ్​ఎల్​డబ్ల్యూ) ఉన్నారు. వారు కాక 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్న 16,96,497 మంది, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 95,19,024 మంది టీకా తీసుకున్నవారిలో ఉన్నారు.

సోమవారం ఒక్కరోజు రాత్రి 7 గంటల వరకు 18,63,623 టీకా డోసులు అందించారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సిబ్బందికి టీకా అందించారు. మార్చి 1 నుంచి.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

అందుకే పెరుగుతున్నాయి..

  • पत्रकारों से बात करते हुए मैंने कहा कि लोगों की लापरवाही के कारण कुछ राज्यों में कोरोना के cases बढ़े हैं। मैंने कहा कि सभी राज्य सरकारों व देश के लोगों को सुनिश्चित करना होगा कि वैक्सीन आने के बाद भी COVID APPROPRIATE BEHAVIOUR में कोताही न बरती जाए।@ombirlakota @PMOIndia pic.twitter.com/I2Ggt2AsbM

    — Dr Harsh Vardhan (@drharshvardhan) March 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొవిడ్ ఆంక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కేసుల పెరుగుదలకు కారణమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే 80 శాతానికి పైగా వైరస్ కేసులు నమోదైనట్లు చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ మాస్క్​లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పార్లమెంట్​ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.

ఇదీ చూడండి: మాస్కు ధరించలేదని మహిళపై అరెస్టు వారెంట్

కరోనా మహమ్మారి పోరులో భాగంగా టీకా పంపిణీలో భారత్​ సరికొత్త మైలురాయిని చేరుకుంది. సోమవారం నాటికి మొత్తం 3,17,71,661 వ్యాక్సిన్ డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అందులో 74,08,521 మంది తొలి డోసు, 43,97,613 రెండో డోసు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు(హెచ్​ఎస్​డబ్ల్యూ) ఉన్నారు. వారితో పాటు 74,26,479 మంది తొలి డోసు, 13,23,527 రెండో డోసు వేయించుకున్న ఫ్రంట్​లైన్ వర్కర్స్​(ఎఫ్​ఎల్​డబ్ల్యూ) ఉన్నారు. వారు కాక 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్న 16,96,497 మంది, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 95,19,024 మంది టీకా తీసుకున్నవారిలో ఉన్నారు.

సోమవారం ఒక్కరోజు రాత్రి 7 గంటల వరకు 18,63,623 టీకా డోసులు అందించారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సిబ్బందికి టీకా అందించారు. మార్చి 1 నుంచి.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

అందుకే పెరుగుతున్నాయి..

  • पत्रकारों से बात करते हुए मैंने कहा कि लोगों की लापरवाही के कारण कुछ राज्यों में कोरोना के cases बढ़े हैं। मैंने कहा कि सभी राज्य सरकारों व देश के लोगों को सुनिश्चित करना होगा कि वैक्सीन आने के बाद भी COVID APPROPRIATE BEHAVIOUR में कोताही न बरती जाए।@ombirlakota @PMOIndia pic.twitter.com/I2Ggt2AsbM

    — Dr Harsh Vardhan (@drharshvardhan) March 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొవిడ్ ఆంక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కేసుల పెరుగుదలకు కారణమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే 80 శాతానికి పైగా వైరస్ కేసులు నమోదైనట్లు చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ మాస్క్​లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పార్లమెంట్​ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.

ఇదీ చూడండి: మాస్కు ధరించలేదని మహిళపై అరెస్టు వారెంట్

Last Updated : Mar 15, 2021, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.