ETV Bharat / bharat

పుట్టినరోజు వేడుకల్లో తుపాకులతో బందిపోట్ల హల్​చల్​! - रामबाबू गडरिया

పుట్టినరోజు వేడుకల్లో తుపాకులు పట్టుకుని బందిపోటు ముఠాలు హల్​చల్ చేశాయి. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తూ వందలాది మంది గుమికూడారు. మధ్యప్రదేశ్​లోని భిండ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

guns
తుపాకీలు పట్టుకుని పుట్టినరోజు వేడుకల్లో హల్​చల్​
author img

By

Published : May 21, 2021, 1:17 PM IST

తుపాకులు పట్టుకుని భారీగా గుమికూడిన జనం

ఎన్నో ఏళ్లుగా బందిపోట్లుకు నెలవుగా పేరున్న మధ్యప్రదేశ్​ చంబల్​ ప్రాంతంలో పరిస్థితులను మార్చడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదనడానికి సాక్ష్యంగా నిలిచింది బుధవారం జరిగిన ఓ సంఘటన. భిండ్​​ జిల్లాలో తుపాకులు పట్టుకుని చాలా మంది గుమికూడి, నినాదాలు చేస్తూ ఓ పుట్టినరోజు వేడుకలు నిర్వహించటం కలకలం రేపింది.

కర్ఫ్యూ సమయంలో..

గోర్కి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూరా కాచ్నవ్​ గామానికి చెందిన రామ్ లక్ష్మణ్​ బఘెల్ తన కుమారుడి​ పుట్టిన రోజు వేడుకలు బుధవారం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గమికూడటంపై నిషేధం ఉన్నప్పటికీ వారు ఈ వేడుకలను జరిపారు. చాలా మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్వాలియర్​కు చెందిన గిరిరాజ్​ పహిల్వాన్​ అనే వ్యక్తి.. తన అనుచరగణంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం వారంతా తుపాకులతో ఓ క్వారీ గుంత వద్దకు చేరి.. హల్​చల్ చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తాము వెళ్లేసరికి అక్కడ భారీగా జనం గుమిగూడి ఉండటం కనిపించిందని ఎస్పీ కమలేశ్​ కుమార్​ కుమార్ తెలిపారు. అయితే.. వారంతా వెంటనే పారిపోయారని చెప్పారు. కానీ, ఈ వేడుకలను నిర్వహించిన రాజేశ్​ పుత్ర రామ్​ లక్ష్మణ్​ బఘెల్, గిరిరాజ్​ పహిల్వాన్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని సబ్​డివిజన్​ మేజిస్ట్రేట్​ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

బందిపోటు పేరుతో నినాదాలు..

ఈ పుట్టినరోజుకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇందులో రాంబాబు గదారియా అనే బందిపోటు నాయకుడి పేరుతో నినాదాలను చేయటం ఈ వీడియోలో వినిపించింది. కానీ, ఈ విషయంపై అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

ఇదీ చూడండి: అత్యాచారం​ కేసులో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

తుపాకులు పట్టుకుని భారీగా గుమికూడిన జనం

ఎన్నో ఏళ్లుగా బందిపోట్లుకు నెలవుగా పేరున్న మధ్యప్రదేశ్​ చంబల్​ ప్రాంతంలో పరిస్థితులను మార్చడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదనడానికి సాక్ష్యంగా నిలిచింది బుధవారం జరిగిన ఓ సంఘటన. భిండ్​​ జిల్లాలో తుపాకులు పట్టుకుని చాలా మంది గుమికూడి, నినాదాలు చేస్తూ ఓ పుట్టినరోజు వేడుకలు నిర్వహించటం కలకలం రేపింది.

కర్ఫ్యూ సమయంలో..

గోర్కి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూరా కాచ్నవ్​ గామానికి చెందిన రామ్ లక్ష్మణ్​ బఘెల్ తన కుమారుడి​ పుట్టిన రోజు వేడుకలు బుధవారం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గమికూడటంపై నిషేధం ఉన్నప్పటికీ వారు ఈ వేడుకలను జరిపారు. చాలా మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్వాలియర్​కు చెందిన గిరిరాజ్​ పహిల్వాన్​ అనే వ్యక్తి.. తన అనుచరగణంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం వారంతా తుపాకులతో ఓ క్వారీ గుంత వద్దకు చేరి.. హల్​చల్ చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తాము వెళ్లేసరికి అక్కడ భారీగా జనం గుమిగూడి ఉండటం కనిపించిందని ఎస్పీ కమలేశ్​ కుమార్​ కుమార్ తెలిపారు. అయితే.. వారంతా వెంటనే పారిపోయారని చెప్పారు. కానీ, ఈ వేడుకలను నిర్వహించిన రాజేశ్​ పుత్ర రామ్​ లక్ష్మణ్​ బఘెల్, గిరిరాజ్​ పహిల్వాన్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని సబ్​డివిజన్​ మేజిస్ట్రేట్​ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

బందిపోటు పేరుతో నినాదాలు..

ఈ పుట్టినరోజుకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇందులో రాంబాబు గదారియా అనే బందిపోటు నాయకుడి పేరుతో నినాదాలను చేయటం ఈ వీడియోలో వినిపించింది. కానీ, ఈ విషయంపై అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

ఇదీ చూడండి: అత్యాచారం​ కేసులో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.