ETV Bharat / bharat

జాతీయ మ్యూజియంగా పార్లమెంట్​ భవనాలు! - పార్లమెంట్​ వారసత్వ కట్టడాలను నేషనల్​ మ్యూజియంగా మార్చనున్నారు

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడున్న పార్లమెంట్​ ఆవరణలోని వారసత్వ కట్టడాలను కూల్చబోమని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాటిని పునరుద్ధరించి నేషనల్​ మ్యూజియంగా మార్చనున్నట్లు తెలిపింది.

Heritage buildings in central vista will be used as national museum
జాతీయ మ్యూజియంగా మారనున్న పార్లమెంట్​ వారసత్వ కట్టడాలు
author img

By

Published : Mar 19, 2021, 1:41 PM IST

ప్రతిష్ఠాత్మకమైన సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​లో భాగంగా ఇప్పుడున్న పార్లమెంట్​ భవనాల్లోని చాలావాటిని పునరుద్ధరించి నేషనల్​ మ్యూజియంలా వినియోగించుకోనున్నట్లు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారసత్వ భవనాలైన నార్త్​, సౌత్​ బ్లాక్​లను మ్యూజియంగా మార్చబోతున్నట్లు తెలిపింది. జన్​పథ్​ హోటల్​ భవనంలో ప్రస్తుతం ఉన్న నేషనల్​ మ్యూజియం (ఇందిరాగాంధీ నేషనల్​ సెంటర్​ ఫర్​ ఆర్ట్స్)ను పునరుద్ధరించిన భవనాల్లోకి బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. కృషి భవన్​, నిర్మాణ్​ భవన్​ల భవితవ్యం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

జాతీయ మ్యూజియంగా మారనున్న పార్లమెంట్​ వారసత్వ భవనాలు

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు..

కేంద్ర సెక్రటేరియేట్​ నిర్మాణంలో భాగంగా 3 కిలోమీటర్ల రాజ్​పథ్​ను పునరుద్ధరిస్తూ..గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ తాజాగా సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో సీట్ల సామర్థ్యాన్ని పెంచుతూ నూతన పార్లమెంట్​ భవనాన్ని నిర్ణించనున్నారు. ప్రధాని, ఉపరాష్ట్రపతికి నూతన భవనాలను నిర్మించనున్నారు. రూ.20 వేల కోట్ల బడ్జెట్​తో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు 2024లో పూర్తికానుంది. రాజ్యసభలో 384 సీట్లు, లోక్​సభలో 888 సీట్లు, ఉభయ సభల సమావేశాలకు 1272 సీట్ల సామర్థ్యంతో భవనాల నిర్మాణం జరగనుందని రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్ధీప్​ సింగ్​ పూరీ బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎన్ని భవనాలను కూల్చనున్నారు? ఎన్ని భవనాలను పునరుద్ధరించనున్నారో ఇంకా పూర్తిగా నిర్ణయించలేదని తెలిపారు.

రాష్ట్రాలకు ఆదర్శం..

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువనుందని అర్బన్​ మేనేజ్​మెంట్​ అండ్ కోఆర్టినేటర్​ డా.కేకే పాండ్యా చెప్పారు. వారసత్వ కట్టడాలు కలిగిన కర్ణాటక, బంగాల్​, ఉత్తరప్రదేశ్​లు..​ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువనున్నాయని తెలిపారు.

"ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో వారసత్వ కట్టడాలను కూల్చే ప్రసక్తే లేదు. వాటిని పునరుద్ధరించనున్నాం. వారసత్వ పరిరక్షణ కమిటీ ఈ బాధ్యతలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వివిధ ప్రదేశాల్లో ఉంటే..శాఖల మధ్య సమన్వయం కష్టంగా మారింది.చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ ఈ ప్రాజెక్టుతో పరిష్కారం దొరకనుంది. రూ.971 కోట్ల బడ్జెట్​తో 2022 నాటికి కొత్త పార్లమెంట్​ భవనం పూర్తికానుంది"

-డా.కేకే పాండ్యా, అర్బన్​ మేనేజ్​మెంట్​ అండ్ కోఆర్టినేటర్

ఇదీ చదవండి: 'మోదీ.. భగవంతుని అవతారం'

ప్రతిష్ఠాత్మకమైన సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​లో భాగంగా ఇప్పుడున్న పార్లమెంట్​ భవనాల్లోని చాలావాటిని పునరుద్ధరించి నేషనల్​ మ్యూజియంలా వినియోగించుకోనున్నట్లు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారసత్వ భవనాలైన నార్త్​, సౌత్​ బ్లాక్​లను మ్యూజియంగా మార్చబోతున్నట్లు తెలిపింది. జన్​పథ్​ హోటల్​ భవనంలో ప్రస్తుతం ఉన్న నేషనల్​ మ్యూజియం (ఇందిరాగాంధీ నేషనల్​ సెంటర్​ ఫర్​ ఆర్ట్స్)ను పునరుద్ధరించిన భవనాల్లోకి బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. కృషి భవన్​, నిర్మాణ్​ భవన్​ల భవితవ్యం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

జాతీయ మ్యూజియంగా మారనున్న పార్లమెంట్​ వారసత్వ భవనాలు

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు..

కేంద్ర సెక్రటేరియేట్​ నిర్మాణంలో భాగంగా 3 కిలోమీటర్ల రాజ్​పథ్​ను పునరుద్ధరిస్తూ..గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ తాజాగా సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో సీట్ల సామర్థ్యాన్ని పెంచుతూ నూతన పార్లమెంట్​ భవనాన్ని నిర్ణించనున్నారు. ప్రధాని, ఉపరాష్ట్రపతికి నూతన భవనాలను నిర్మించనున్నారు. రూ.20 వేల కోట్ల బడ్జెట్​తో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు 2024లో పూర్తికానుంది. రాజ్యసభలో 384 సీట్లు, లోక్​సభలో 888 సీట్లు, ఉభయ సభల సమావేశాలకు 1272 సీట్ల సామర్థ్యంతో భవనాల నిర్మాణం జరగనుందని రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్ధీప్​ సింగ్​ పూరీ బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎన్ని భవనాలను కూల్చనున్నారు? ఎన్ని భవనాలను పునరుద్ధరించనున్నారో ఇంకా పూర్తిగా నిర్ణయించలేదని తెలిపారు.

రాష్ట్రాలకు ఆదర్శం..

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువనుందని అర్బన్​ మేనేజ్​మెంట్​ అండ్ కోఆర్టినేటర్​ డా.కేకే పాండ్యా చెప్పారు. వారసత్వ కట్టడాలు కలిగిన కర్ణాటక, బంగాల్​, ఉత్తరప్రదేశ్​లు..​ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువనున్నాయని తెలిపారు.

"ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో వారసత్వ కట్టడాలను కూల్చే ప్రసక్తే లేదు. వాటిని పునరుద్ధరించనున్నాం. వారసత్వ పరిరక్షణ కమిటీ ఈ బాధ్యతలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వివిధ ప్రదేశాల్లో ఉంటే..శాఖల మధ్య సమన్వయం కష్టంగా మారింది.చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ ఈ ప్రాజెక్టుతో పరిష్కారం దొరకనుంది. రూ.971 కోట్ల బడ్జెట్​తో 2022 నాటికి కొత్త పార్లమెంట్​ భవనం పూర్తికానుంది"

-డా.కేకే పాండ్యా, అర్బన్​ మేనేజ్​మెంట్​ అండ్ కోఆర్టినేటర్

ఇదీ చదవండి: 'మోదీ.. భగవంతుని అవతారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.