ETV Bharat / bharat

'వివాహం కాకుండానే తల్లి అయిన మహిళ'.. కోర్టు సంచలన తీర్పు

author img

By

Published : Aug 24, 2021, 1:09 PM IST

వివాహం జరగకుండానే తల్లి అయిన మహిళను.. బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలని ఒత్తిడి చేయవచ్చా? బలవంతంగానైనా పేరు చెప్పించాల్సిందేనన్న న్యాయ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఓ కేసు విచారణలో భాగంగా గుజరాత్‌ హైకోర్టు.. పలు ధర్మ సంకటమైన సందేహాలను లేవనెత్తింది.

gujarat highcourt
గుజరాత్ హైకోర్టు

"ఆమెకు ఇంకా వివాహం కాలేదు.. అయినా తల్లి అయ్యింది!... తాను జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరో వెల్లడించాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుందా? ఆ చిన్నారి జన్మకు కారకుడైన వ్యక్తి పేరును వెల్లడించాల్సిందేనని ఆమెను ఒత్తిడికి గురిచేయవచ్చా? బలవంతంగానైనా పేరు చెప్పించాల్సిందేనన్న న్యాయ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అత్యాచారానికి గురైనట్లు కూడా ఫిర్యాదు చేయని పరిస్థితుల్లో.. సమాధానం తెలిసినా బహిర్గతం చేయని ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చా?" అంటూ ధర్మ సంకటమైన పలు ప్రశ్నలను గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయి రేకెత్తించారు.

చర్యలు ఎలా తీసుకోగలం..?

బాలికపై అత్యాచారం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించటాన్ని సవాల్‌ చేస్తూ ఓ ముద్దాయి గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ పరేశ్‌ న్యాయబద్ధమైన పలు సందేహాలను వ్యక్తం చేశారు. వివాహం కాకుండానే, తన ఇష్టప్రకారంగా బిడ్డను కనేందుకు గర్భందాల్చిన మహిళపై ఏ న్యాయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని చర్యలు తీసుకోగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు.

"ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఎవరితో కలిసి జీవిస్తున్నారనేది సమస్య కాబోదు. నగరాలు, మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో ఈ తరహా ఉదంతాలను 'ఆధునికం' అని సమర్థించుకుంటారు. అదే గ్రామాల్లో అయితే తీవ్ర విమర్శలు వస్తాయి. కొన్ని గిరిజన తెగల్లో బిడ్డను కనటానికి మహిళకు వివాహ బంధం తప్పనిసరికాదు. 18ఏళ్ల వయసు రాక ముందే తల్లి కావడాన్ని అక్రమమైన వ్యవహారంగానూ అక్కడ పరిగణించరు. కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళను అక్కడి వైద్యులు ఆ బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలని కోరినప్పుడు. 'నాకు తెలియదు. వెల్లడించడం ఇష్టంలేదు. తెలిసినా పేరు బహిర్గతం చేయడంపై ఆసక్తిలేదు' అన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితి ఏమిటి? ఇలాంటి కేసుల్లో ఏ న్యాయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని భావించగలం"

-- జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయ్‌, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి

ఇదీ జరిగింది..

జునాగఢ్‌కు చెందిన బాలిక వివాహం కాకుండానే ఓ వ్యక్తితో కలిసి జీవిస్తూ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తన ఇష్టప్రకారమే ఇల్లు వదిలి వచ్చి ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి ఆమె వయస్సు 16 ఏళ్లు. ఆ తర్వాత మరో రెండేళ్ల లోపే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. 2020, మార్చి 24వ తేదీకి ఆమెకు 18 ఏళ్లు నిండుతాయి. మార్చి 25న సహజీవనం చేస్తున్న వ్యక్తినే వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అది వాయిదాపడింది.

బాలిక రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె తండ్రి.. మైనర్‌ అయిన తన కుమార్తెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన దిగువ కోర్టు నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 376(అత్యాచారం), పోక్సో చట్టం ప్రకారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. దానిని నిందితుడు హైకోర్టులో సవాల్‌ చేశాడు.

ఇదీ చదవండి: 'ఆ సరిహద్దుల్లో రహదారులను పునఃప్రారంభించండి'

"ఆమెకు ఇంకా వివాహం కాలేదు.. అయినా తల్లి అయ్యింది!... తాను జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరో వెల్లడించాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుందా? ఆ చిన్నారి జన్మకు కారకుడైన వ్యక్తి పేరును వెల్లడించాల్సిందేనని ఆమెను ఒత్తిడికి గురిచేయవచ్చా? బలవంతంగానైనా పేరు చెప్పించాల్సిందేనన్న న్యాయ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అత్యాచారానికి గురైనట్లు కూడా ఫిర్యాదు చేయని పరిస్థితుల్లో.. సమాధానం తెలిసినా బహిర్గతం చేయని ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చా?" అంటూ ధర్మ సంకటమైన పలు ప్రశ్నలను గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయి రేకెత్తించారు.

చర్యలు ఎలా తీసుకోగలం..?

బాలికపై అత్యాచారం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించటాన్ని సవాల్‌ చేస్తూ ఓ ముద్దాయి గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ పరేశ్‌ న్యాయబద్ధమైన పలు సందేహాలను వ్యక్తం చేశారు. వివాహం కాకుండానే, తన ఇష్టప్రకారంగా బిడ్డను కనేందుకు గర్భందాల్చిన మహిళపై ఏ న్యాయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని చర్యలు తీసుకోగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు.

"ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఎవరితో కలిసి జీవిస్తున్నారనేది సమస్య కాబోదు. నగరాలు, మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో ఈ తరహా ఉదంతాలను 'ఆధునికం' అని సమర్థించుకుంటారు. అదే గ్రామాల్లో అయితే తీవ్ర విమర్శలు వస్తాయి. కొన్ని గిరిజన తెగల్లో బిడ్డను కనటానికి మహిళకు వివాహ బంధం తప్పనిసరికాదు. 18ఏళ్ల వయసు రాక ముందే తల్లి కావడాన్ని అక్రమమైన వ్యవహారంగానూ అక్కడ పరిగణించరు. కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళను అక్కడి వైద్యులు ఆ బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలని కోరినప్పుడు. 'నాకు తెలియదు. వెల్లడించడం ఇష్టంలేదు. తెలిసినా పేరు బహిర్గతం చేయడంపై ఆసక్తిలేదు' అన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితి ఏమిటి? ఇలాంటి కేసుల్లో ఏ న్యాయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని భావించగలం"

-- జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయ్‌, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి

ఇదీ జరిగింది..

జునాగఢ్‌కు చెందిన బాలిక వివాహం కాకుండానే ఓ వ్యక్తితో కలిసి జీవిస్తూ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తన ఇష్టప్రకారమే ఇల్లు వదిలి వచ్చి ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి ఆమె వయస్సు 16 ఏళ్లు. ఆ తర్వాత మరో రెండేళ్ల లోపే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. 2020, మార్చి 24వ తేదీకి ఆమెకు 18 ఏళ్లు నిండుతాయి. మార్చి 25న సహజీవనం చేస్తున్న వ్యక్తినే వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అది వాయిదాపడింది.

బాలిక రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె తండ్రి.. మైనర్‌ అయిన తన కుమార్తెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన దిగువ కోర్టు నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 376(అత్యాచారం), పోక్సో చట్టం ప్రకారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. దానిని నిందితుడు హైకోర్టులో సవాల్‌ చేశాడు.

ఇదీ చదవండి: 'ఆ సరిహద్దుల్లో రహదారులను పునఃప్రారంభించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.