రైతు ఉద్యమానికి వినూత్నంగా మద్దతు తెలిపారు హరియాణాకు చెందిన ఓ రైతు. కైథల్ దుంద్రేహ్రీ గ్రామానికి చెందిన ప్రేమ్ సింగ్ గోయత్.. తన కుమారుడి వివాహ పత్రికలో 'రైతులు లేకపోతే.. ఆహారం లేదు' అనే నినాదాన్ని ముద్రించారు. ట్రాక్టర్పై రైతు ఉన్న చిత్రాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. బ్రిటిష్ కాలంలో రైతుల హక్కుల కోసం పోరాడిన నేత చోటూ రామ్, స్వాతంత్య్ర సమర యోధుడు భగత్సింగ్ల చిత్రాలనూ పెళ్లికార్డులపై ఉంచారు.
"కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా వేల మంది రైతులు రెండు నెలలుగా ఉద్యమిస్తున్నారు. వారికి ఈ విధంగా సంఘీభావం తెలుపుతున్నాం. నా కుమారుడి పెళ్లి కారణంగా నేను ఉద్యమంలో పాల్గొనలేకపోయాను."
- ప్రేమ్ సింగ్ గోయత్, హరియాణా రైతు
ఇదీ చదవండి : వ్యవసాయశాఖ మంత్రిపై ప్రధాని ప్రశంసలు