గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా విజయదుందుభి మోగించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భాజపా చేసిన అభివృద్ధి, సుపరిపాలనకు గుజరాత్ ప్రజలు మరోమారు పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు. భాజపాకు అఖండ విజయం అందించిన ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నాని ట్వీట్ చేశారు.
"గుజరాత్లో నగర పాలక, తాలూక పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికలు.. భాజపా అభివృద్ధి, సుపరిపాలన అజెండాతోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. భాజపా పట్ల తిరుగులేని విశ్వాసం, బంధాన్ని కలిగి ఉన్నందుకు గుజరాత్ ప్రజలకు నమస్కరిస్తున్నా."
-నరేంద్ర మోదీ, ప్రధాని
గుజరాత్ నగర పాలక ఎన్నికల్లో పార్టీలు గెలుచుకున్న సీట్లు
భాజపా- 1,967
కాంగ్రెస్-356
ఆప్- 09
మొత్తం 31జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 980 స్థానాలకు పార్టీలు గెలుచుకున్నవి
భాజపా- 735
కాంగ్రెస్-157
ఆప్-02
31జిల్లాలో పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలు, 81మున్సిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. 23మున్సిపాలిటీలకు ఉపఎన్నికలు జరిగాయి. తాలుకా పంచాయతీలలో 66.84శాతం పోలింగ్ నమోదయింది.
ఇదీ చూడండి: గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల రాజీనామా