ETV Bharat / bharat

ప్రశాంతంగా గుజరాత్​​ 'స్థానిక' పోరు- ఓటేసిన షా

author img

By

Published : Feb 21, 2021, 11:39 AM IST

Updated : Feb 21, 2021, 11:49 AM IST

గుజరాత్​లో మున్సిపల్ కార్పొరేషన్​ల తొలిదశ పోలింగ్​ జోరుగా సాగుతోంది. కొవిడ్​ నిబంధనల నడుమ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. అహ్మదాబాద్​లోని నారన్​పురలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

GUJARAT Civic Polls
గుజరాత్​లో జోరుగా స్థానిక పోరు.. అమిత్ షా ఓటు

గుజరాత్​లో స్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొదటి నాలుగు గంటల్లో 7.1 శాతం పోలింగ్​ నమోదైంది. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్​, వడోదర, సూరత్​, రాజ్​కోట్​, జామ్​నగర్​, భావ్​నగర్​) నగర కార్పొరేషన్లకు పోలింగ్​ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కరోనా నిబంధనల మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

తొలిదశ పోలింగ్​లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. తన కుటుంబసభ్యులతో కలిసి అహ్మదాబాద్​లోని నారన్​పుర వార్డులో ఓటు వేశారు.

GUJARAT Civic Polls
ఓటింగ్​లో కేంద్ర హోం మంత్రి
GUJARAT Civic Polls
ఓటు వేసిన అనంతరం కుటుంబ సభ్యులతో అమిత్​ షా

రాజ్​కోట్​లో సీఎం రూపానీ.!

ఇటీవల కరోనా బారినపడిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ.. తన స్వస్థలమైన రాజ్​కోట్​లో ఓటు వేయనున్నారు

ఇప్పటివరకు.. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఓటు వేశారు. వారిలో భాజాపా ఎంపీ కిరిత్​ సోలంకి.. రాణిప్​ ప్రాంతంలో ఓటు వేయగా.. ఎమ్మెల్యే రాకేశ్​ షా ఎల్లిస్​బ్రిడ్జ్​ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

GUJARAT Civic Polls
ఓటు వేసిన అనంతరం కుటుంబ సభ్యులతో భాజపా ఎంపీ
GUJARAT Civic Polls
కమలం గుర్తుతో భాజపా ఎంపీ

ఏ పార్టీ? ఎన్ని స్థానాల్లో?

రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ స్థానిక ఎన్నికలు కీలకం కానున్నాయి. భాజపా, కాంగ్రెస్​లు ప్రధాన పోటీదారులుగా నిలవగా.. వాటికి తమ పార్టీయే ప్రత్యామ్నాయంగా భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్​). మొత్తం 575 స్థానాలకు 2276 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భాజపా నుంచి 577, కాంగ్రెస్ 566, ఆమ్​ఆద్మీ పార్టీ 470, ఎన్సీపీ 91, ఇతరులు 353, స్వతంత్రులు 228 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసదుద్దీన్​ ఒవైసీకి చెందిన ఎఐఐఎంఐఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్) కూడా 21 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.

6 నగరాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. 11,121 పోలింగ్​ బూత్​లు ఏర్పాటు చేయగా వాటిల్లో 2255 సున్నితమైనవని, 1188 అత్యంత సున్నితమైనవిగా పేర్కొన్నారు. మొత్తం 32,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

రెండో దశలో 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: అమ్మ భాషే జీవితానికి ఆత్మ: వెంకయ్య నాయుడు

గుజరాత్​లో స్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొదటి నాలుగు గంటల్లో 7.1 శాతం పోలింగ్​ నమోదైంది. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్​, వడోదర, సూరత్​, రాజ్​కోట్​, జామ్​నగర్​, భావ్​నగర్​) నగర కార్పొరేషన్లకు పోలింగ్​ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కరోనా నిబంధనల మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

తొలిదశ పోలింగ్​లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. తన కుటుంబసభ్యులతో కలిసి అహ్మదాబాద్​లోని నారన్​పుర వార్డులో ఓటు వేశారు.

GUJARAT Civic Polls
ఓటింగ్​లో కేంద్ర హోం మంత్రి
GUJARAT Civic Polls
ఓటు వేసిన అనంతరం కుటుంబ సభ్యులతో అమిత్​ షా

రాజ్​కోట్​లో సీఎం రూపానీ.!

ఇటీవల కరోనా బారినపడిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ.. తన స్వస్థలమైన రాజ్​కోట్​లో ఓటు వేయనున్నారు

ఇప్పటివరకు.. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఓటు వేశారు. వారిలో భాజాపా ఎంపీ కిరిత్​ సోలంకి.. రాణిప్​ ప్రాంతంలో ఓటు వేయగా.. ఎమ్మెల్యే రాకేశ్​ షా ఎల్లిస్​బ్రిడ్జ్​ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

GUJARAT Civic Polls
ఓటు వేసిన అనంతరం కుటుంబ సభ్యులతో భాజపా ఎంపీ
GUJARAT Civic Polls
కమలం గుర్తుతో భాజపా ఎంపీ

ఏ పార్టీ? ఎన్ని స్థానాల్లో?

రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ స్థానిక ఎన్నికలు కీలకం కానున్నాయి. భాజపా, కాంగ్రెస్​లు ప్రధాన పోటీదారులుగా నిలవగా.. వాటికి తమ పార్టీయే ప్రత్యామ్నాయంగా భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్​). మొత్తం 575 స్థానాలకు 2276 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భాజపా నుంచి 577, కాంగ్రెస్ 566, ఆమ్​ఆద్మీ పార్టీ 470, ఎన్సీపీ 91, ఇతరులు 353, స్వతంత్రులు 228 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసదుద్దీన్​ ఒవైసీకి చెందిన ఎఐఐఎంఐఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్) కూడా 21 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.

6 నగరాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. 11,121 పోలింగ్​ బూత్​లు ఏర్పాటు చేయగా వాటిల్లో 2255 సున్నితమైనవని, 1188 అత్యంత సున్నితమైనవిగా పేర్కొన్నారు. మొత్తం 32,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

రెండో దశలో 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: అమ్మ భాషే జీవితానికి ఆత్మ: వెంకయ్య నాయుడు

Last Updated : Feb 21, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.